ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై వివరాలు వెల్లడించిన వీసీ లక్ష్మీకాంత్రాథోడ్
పాలమూరు, నవంబర్ 22: మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో 24న మూడో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారని చెప్పారు. ముందుగా ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల ప్రోగ్రాలు ఏర్పాటు చేశామని, పీహెచ్డీ విద్యార్థులకు అవార్డులు, గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు పీయూలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పర్యవేక్షించేందుకు బోధన, బోధనేతర సిబ్బందితో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ గిరిజామంగతయారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.రాజ్కుమార్, ప్రిన్సిపాల్ డా.ఎన్.కిశోర్, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, డైరెక్టర్స్ రీసర్చ్ సెల్ ప్రొఫెసర్ పిండి పవన్కుమార్, స్పెషల్ ఆఫీసర్ నాగభూషణం, జాయింట్ డైరెక్టర్ నూర్జహాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.కుమారస్వామి, పీఆర్వో అర్జున్కుమార్, ఏపీఆర్వో డా.రఘు ఉన్నారు.