కోయిలకొండ, జనవరి 1 : పాలమూరు జి ల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా.. మహిమాన్విత క్షేత్రంగా కోయిలకొండలోని శ్రీ రామకొండ పేరుగాంచింది. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. కొండపై స్వయంభూగా రామపాదం వెలిసింది. అందుకే స్వా మిని దర్శించుకునేందుకు భారీగా వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశా రు. రాములోరి ఆలయ సమీపంలో గుట్టపై వనమూలికల చెట్లు ఉన్నాయి. స్నానం చేసేందుకు కోనేరు ఉన్నది. కొండకు వచ్చి దర్శనం చేసుకున్న భక్తులు వనమూలికలు, కోనేరు నీటిని వెంట తీసుకెళ్తుంటారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొండపై బారికేడ్లు నిర్మించారు. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను అనుమతించమని, కొండపైకి నడుచుకుంటే వెళ్లాలని ఎస్సై సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
కొండపైకి రోడ్డు..
శ్రీరామకొండకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కృషితో కొండపైకి రోడ్డు నిర్మించారు. రహదారితోపాటు విద్యుత్లైన్, తాగునీటి వసతి కల్పించారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.