మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 23: దేశ సేవలో విధి నిర్వహణలో ఎందరో పోలీసులు విలువైన ప్రాణాలను ఆర్పించారని, వారి త్యాగాలు, పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల స్మరణలో భాగంగా అదివారం జిల్లా కేంద్రంలో పోలీస్ ఫ్లాగ్డే నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మెట్టుగడ్డ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, శ్రీనివాసులు, సీఐ రాజేశ్వర్గౌడ్, స్వామి, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.