జడ్చర్ల, అక్టోబర్ 23 : జడ్చర్ల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బాదేపల్లి-బూరెడ్డిపల్లి ప్రధానరహదారి పొడవునా ఓపెన్ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన చేశారు. అయితే రోడ్డు పొడవునా చాలామంది సెట్బ్యాక్ లేకుండా ఇండ్ల నిర్మాణం చేసుకోవడంవల్ల కొన్ని కల్వర్టులు కనుమరుగయ్యాయని, వర్షాలు కురిసినప్పుడు రోడ్డుపై నీరు పారుతుండడంతో గుంతలమయంగా మారుతున్నదని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ రోడ్డుకు ఇరువైపులా సెట్బ్యాక్ వదిలేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువకు వాననీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ నిర్మాణం చేపడుతామని తెలిపారు. అలాగే అన్ని కాలనీల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీల నిర్మా ణం చేపట్టాలని అధికారులకు సూచించారు.
నవాబ్పేట మండలం తీగలపల్లి, దర్పల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులు మత్స్యపారిశ్రామిక సహకార సం ఘాలను ఏర్పాటు చేసుకున్నారు. సంఘాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన బైలాను జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కొత్త సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జడ్చర్లలోని 12వ వార్డులో ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నొస్టిక్ సెంటర్ను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, ఉమాదేవి, రమేశ్, దోరేపల్లి రవీందర్, నాయకులు మురళి, శ్రీనివాస్యాదవ్, వెంకటేశ్, ఆంజనేయులు, జాఫర్, వెంకటేశ్గౌడ్, చెన్నకేశవులు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 23 : మండలకేంద్రానికి చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు నర్సింహులు (52) శనివారం గుండెపోటు తో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదివారం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముందుగా నర్సింహులు పార్థ్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల నాయకులు ఉన్నారు.