మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 9 : మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లావ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మక్కా మసీద్ నుంచి మిలాద్ జులూస్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జులూస్కు స్వాగతం పలికారు. ర్యాలీలో చిన్నారులు ఖురాన్ సూక్తులను, భక్తిగీతాలను ఆలపిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా మతపెద్దలు మిలాద్ ఉన్ నబీ సందేశం ఇచ్చారు. అలాగే పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పలువురు ప్రవక్త పేరుపై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. షాషాబ్గుట్ట దర్గా ఆవరణలో నిర్వహించిన సభలో గుల్బర్గకు చెందిన మౌలానా మహ్మద్ అష్రఫీ ధార్మిక సందేశం ఇచ్చారు.
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన జులూస్లో మంత్రి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహ్మద్ ప్రవక్త జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గం అనుసరించాలని సూచించారు. కా ర్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, ఎస్పీ వెంకటేశ్వర్లు, షాషాబ్గుట్ట దర్గా పీఠాధిపతి అబ్దుల్ రజాక్షా ఖాద్రీ, జులూస్ కమిటీ ప్రతినిధులు సయ్యద్ అఫ్రోజ్షా ఖాద్రీ, అమీనుద్దీన్ ఖాద్రీ, వాసిఫ్షా ఖాద్రీ, గౌస్ మొహిద్దీన్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అబ్దుల్హదీ, అన్వర్పాషా, జాకీర్, మోసీన్ఖాన్, సమాద్ఖాన్, ఒబేదుల్లాకొత్వాల్, షబ్బీర్ అహ్మద్, జావిద్బేగ్, జహంగీర్, జహంగీర్బాబా తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, అక్టోబర్ 9 : జడ్చర్ల పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాదేపల్లి జామే మసీదులో ఆసారే ముబారక్ ప్రదర్శన నిర్వహించడంతోపాటు పలు మసీదుల్లో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక మైమన్ మసీదు నుంచి కావేరమ్మపేట జామే మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌరస్తా, అంబేద్కర్, నేతాజీ చౌరస్తా ల్లో యువకులు పాలషర్బత్, పలహారాలను పంపిణీ చేశారు. అదేవిధంగా కావేరమ్మపేట జామే మసీదులో మర్కజీ కమి టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ప్రారంభించారు. వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 9 : మండలకేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, మతపెద్దలు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, అక్టోబర్ 9 : మున్సిపాలిటీ కేంద్రంలో మిలా ద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జామే మసీద్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఇబ్రహీం, అహ్మద్, ఖదీర్, అఫ్సర్, యాసీన్, జహంగీర్, సాదీక్, ఖాదర్, జామే మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, అక్టోబర్ 9 : మండలకేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ముస్లింలకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, నాజీమ్, ఇనాయత్, సోహేల్, అసీన్, అలియన్ చావేస్, అన్ను తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, అక్టోబర్ 9 : మండలకేంద్రంతోపాటు జా నంపేట, వేముల, పోల్కంపల్లి, తిమ్మాపూర్ తదితర గ్రామా ల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూసాపేట మసీదు కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శెట్టి శేఖర్, గూపని కొండయ్య, మశ్చేందర్నాత్, కోఆప్షన్ సభ్యుడు అ బ్దుల్ జమీర్, ఖాజామైనొద్దీన్, కలీం, అబ్దుల్ ఖాదర్, ఎండీ సత్తార్, ఇమ్రాన్, యాసిన్పాషా, సలాం పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 9 : మండలకేంద్రంతోపాటు పొన్నకల్, కందూరు, రాచాల, శాఖాపూర్ గ్రామా ల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, షఫీ అహ్మద్, జహంగీర్గోరి, అబ్దుల్ గోరి, అఫ్సర్ పాల్గొన్నారు.