మరికల్, సెప్టెంబర్ 30 : దేవుడి పేరుతో కుల, మత రాజకీయాలు చేసేందుకు గ్రామాల్లోకి కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. ‘మన కులం, మన మతం.. తెలంగాణం’ అనేదే సీఎం కేసీఆర్ నినాదమన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద పేట నియోజకవర్గంలోని 84 మంది, మక్తల్ నియోజకవర్గంలోని 18 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పాలన చేతగాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.2 వేలకు కూడా ఈకేవైసీ అంటూ తమాషాలు చేస్తున్నారన్నారు.
పుట్టుక నుంచి చావు వరకు అన్ని రకాల పథకాలతో ఆదుకుంటున్న సర్కార్ కేవలం తెలంగాణలోనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని విమర్శించారు. ఏడాదిపాటు రైతులు ధర్నా చేస్తే నల్లచట్టలను రద్దు చేశారని, అన్నదాతల ఉసురు మోదీకి తగులుతుందన్నారు. దళితబంధు పథకంలో భాగంగా రాకొండ గ్రామానికి చెందిన వెంకట్రాములుకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కారును అందజేశారు. అలాగే ఆసరా పింఛన్ కార్డులు, ప్రొసీడింగ్లు, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, ఎంపీపీలు శ్రీకళారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్యాదవ్, ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ గోవర్ధన్, సింగిల్విండో చైర్మన్ రాజేందర్గౌడ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ సంపత్కుమార్, నాయకులు రాజవర్ధన్రెడ్డి, హన్మిరెడ్డి, రాములు, తిరుపతయ్య, లక్ష్మయ్య, బసంత్, జగదీశ్, రామన్గౌడ్, కృష్ణయ్య, మతీన్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఎంపీడీవో యశోదమ్మ, డీటీ శ్రీనివాసులు, ఆర్ఐలు సుధాకర్రెడ్డి, విజయ్కుమార్, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.