నాగర్కర్నూల్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలకు ఇక కాలం చెల్లనున్నది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ పథకాన్ని అమలు చేస్తున్నది. యజమానులు స్వీ య ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే కేవలం 21 రోజుల్లోనే ఇండ్లు, భవన నిర్మాణాలను చేపట్టొ చ్చు. కానీ, చాలా చోట్ల ఈ నిబంధనలను యజమానులు అమలు చేయడం లేదు. స్వీయ ధ్రువీకరణలో ఇచ్చిన వివరాలకు భిన్నంగా పెద్ద ఎత్తు న భవనాలను అక్రమంగా నిర్మిస్తున్నారు. ప్రభు త్వ స్థలాలు, బఫర్ జోన్, నాలాల పక్కన, రో డ్లను ఆక్రమిస్తూ నిషేధిత స్థలాల్లో భవనాలు కడుతున్నారు.
దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగి మారింది. తరచూ వివాదాలు జరుగుతున్నాయి. కొందరు యజమాను లు రాజకీయ పలుకుబడితో అధికారులను ప్ర భావితం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం రెండేండ్ల నుంచి మున్సిపాల్టీల్లోలాగే అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు టీఎస్ బీపాస్ పథకాన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నది. నీటి పారుదల రంగంలో ప్రగతితో వ్యవసాయం, అనుబం ధ ఉపాధి రంగాలతో ప్రజల్లో ఆర్థిక స్థిరత్వం పెరిగింది. దీంతో పట్టణాల మాదిరిగా గ్రామాల్లో ప్ర స్తుతం భారీ భవనాల నిర్మాణం జరుగుతున్నది. ముఖ్యంగా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఈ నిర్మాణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లోనూ టీఎస్ బీ పాస్ పథకం అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. దీనిపై ఇటీవలే హైదరాబాద్లో జిల్లా పంచాయతీ అధికారులు, ఇం జినీర్లకు శిక్షణ ఇచ్చారు.
ఈ క్రమంలో జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నా యి. ఈ కమిటీల ధ్రువీకరణతోనే గ్రామాల్లోనూ ఇండ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా పది ఎకరాల్లోపు ఉన్న లే అవుట్ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, టైటిల్, టెక్నికల్ వెరిఫికేషన్కు జిల్లా టౌన్, ప్లానింగ్ అధికారులకు బాధ్యతలు కేటాయించారు. అంతకు మించి ఉంటే డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతి కావాల్సి ఉంటుంది. ఇక భవన నిర్మాణ అనుమతులకు మాత్రం మండలం యూనిట్గా కమిటీలు ఉంటాయి. ఇందులో స్థల పరిశీలనకు డిప్యూటీ తాసిల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్, టైటిల్, టెక్నికల్ వెరిఫికేషన్కు పంచాయతీరాజ్ ఏఈఈలు బాధ్యులుగా ఉంటారు. దీనిపై ఆయా మండలాల వారీగా అధికారుల పేర్లను జిల్లా పంచాయతీ అధికారులు నివేదించనున్నారు.
ఈ ప్రక్రియ వారంలో పూర్తి కానున్నది. ఆ వెంటనే గ్రామ పంచాయతీల్లో బీ పాస్ అమలవుతుంది. ఇప్పటివరకు పల్లెల్లో ఈ-పంచాయతీ ద్వారా అనుమతులు మంజూరవుతున్నాయి. అయితే తమ హద్దుల్లోపు నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఉండేది కాదు. నిర్మాణం పూర్తయ్యాక నిర్ణీత రుసుం చెల్లిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి అసెస్మెంట్ చేసి ఆస్తి పన్ను విధిస్తున్నారు. ఇకపై బీపాస్ ద్వారా ప్రభుత్వ ఆమోదిత లే అవుట్ తప్పనిసరిగా ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, యాజమాని ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ వంటి సర్టిఫికెట్లను జతపర్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పత్రాలన్నీ సవ్యంగా ఉంటే అధికారుల బృందం పరిశీలించి నిర్మాణాలకు అనుమతి ఇస్తుంది. దీనికి సంబంధించిన రుసుం ఇప్పటివరకు ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతుండగా.., ఇకపై పంచాయతీ ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఇందుకోసం సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో పంచాయతీ పేరిట కొత్త బ్యాంక్ ఖాతాలను తెరవనున్నారు. దీంతో పల్లెల్లో జరిగే నిర్మాణాలను చూసీచూడనట్లు వదిలేసే వీలుండదు. కార్యదర్శులు ఇష్టానుసారం వ్యవహరించడం, స్థానిక రాజకీయాలకు చెల్లు చీటీ పడనున్నది. టీఎస్ బీపాస్ వల్ల పల్లెల్లో ఇండ్ల నిర్మాణాలు పద్ధతిగా జరగడంతోపాటు పంచాయతీలకూ ఆదాయం సమకూరనున్నది.
గ్రామ పంచాయతీల్లో టీఎస్ బీ పాస్ అమలు చేయనున్నాం. మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో ప్రజలు ఇకపై లే అవుట్లు, ఇండ్లు, భవన నిర్మాణాలన్నింటికీ సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కమిటీల అనుమతితో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలో 85 అక్రమ లే అవుట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. వీటికి రెండు నెలల్లో అనుమతులు తీసుకోవాలి. ఇండ్లకు సైతం ఆన్లైన్లోనే అనుమతులు తీసుకోవాలి. త్వరలో ఈ పంచాయతీ పోర్టల్ బీ పాస్ అనుసంధానమవుతుంది. ఆ వెంటనే జిల్లాలో బీ పాస్ అమలు చేస్తాం.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్