కోస్గి, సెప్టెంబర్ 29 : ఫిర్యాదుదారులపై పోలీసులు సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కోస్గి పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముం దు పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం స్టేషన్ లో మొక్కలు నాటారు. కేసులు పెండింగ్లో లేకుండా చూడాలని సూచించారు. పట్టణంలో ప్రతిరోజూ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎక్కడైనా ఏ విధమైన అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. డయల్ 100కు ఫిర్యా దు వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకోవాలన్నా రు. శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకునేలా వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐ జనార్దన్గౌడ్, ఎస్సై నరేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, సెప్టెంబర్ 29 : పోలీస్స్టేషన్ను గురువారం నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. శాంతిభద్రతల విషయం పై ఎస్సై విజయ్భాస్కర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని, మంచి క్రమశిక్షణ కలిగి ఉండి సమయపాలన పాటించాలని తెలిపారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పై అధికారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.