మిడ్జిల్, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్ర భుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవా రం మండలంలోని మసిగుండ్లపల్లి, వేముల, కొత్తూర్, రాణిపేట, వస్పు ల్, దోనూర్ గ్రామాల్లో లబ్ధిదారుల కు ఆసరా పింఛన్ పత్రాలు, బతుక మ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. కొత్తూర్లో రైతువేదిక, వైకుంఠధామం, మసిగుండ్లపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, వైకుంఠధామాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. వేములలో ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ సర్కార్ జీఎస్టీ పేరుతో వ్యాపారులను ఇ బ్బందుల పాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇక్క డి ఆసరా పథకం పింఛన్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సైతం లేవన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కరెంట్ మోటర్లుకు మీటర్లు పెట్టాలని మోడీ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కమలం పార్టీ నాయకుల మాయమాటలను నమ్మొద్దన్నారు. కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. నవాబ్పేట మండలంలో నూతన మండల ఏర్పాటుకు కనీసం ఏడుగురు ఎంపీటీసీలు అవసరమున్నా.. ఒక్క ఎంపీటీసీతో ఎలా సాధ్యమవుతుందని ప్ర శ్నించారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే గ్రామాల నుంచి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. అనంతరం మ సిగుండ్లపల్లి, రాణిపేట, చిల్వేర్కు చెందిన 20 మంది వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, మార్కెట్ క మిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, జంగిరెడ్డి, సుదర్శన్, సర్పంచులు సుమతమ్మ, రాధికారెడ్డి, జంగయ్య, సం యుక్తారాణి, నారాయణరెడ్డి, నిరంజన్, మధుసూదన్రెడ్డి, సునీత, మేఘనా నాయక్, నాయకు లు పాండు, సుధాబాల్రెడ్డి, బాలు పాల్గొన్నారు.