ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో సబ్బండవర్గాల ప్రజల అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం ఖిల్లాఘణపురం మండలంలో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్ గుర్తింపు కార్డులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పింఛన్లు మానవీయ పాలనకు నిదర్శనమన్నారు.
ఆడబిడ్డల ఆశీర్వాదం తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ఆంధ్రాపాలకుల దోపిడీకి గురైన తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలో అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే రంగాలకు ప్రణాళికబద్ధంగా చేయూతనందించడంతో ఎనిమిదేండ్లలో రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయన్నారు. పేద విద్యార్థులకు ఆంగ్ల బోధన అందించాలనే సంకల్పంతో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 600 పడకల దవాఖాన అందుబాటులోకి రానున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కృష్ణానాయక్, మురళీధర్రెడ్డి, వెంకట్రావు, లక్ష్మారెడ్డి, రాజు, రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.
కాశీంనగర్కు సాగునీళ్లు తెస్తా
వనపర్తి రూరల్, సెప్టెంబర్ 27: నియోజకవర్గంలోని 165 గ్రామ పంచాయతీలకుగానూ ఒక్క కాశీంనగర్కు మాత్రమే సాగునీరు రాలేదని, ఎలాగైనా నీళ్లు సాధించి తీరుతామని మంత్రి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం వనపర్తి మండలంలోని కందిరీయతండా శివారులోని రైతు వేదికలో ఆసరా పింఛన్కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామన్న గట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి కాశీంనగర్కు నీళ్లందిస్తామన్నారు. పోడు భూముల రైతులకు పట్టాలందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచులు రమాదేవి, దేవేంద్రనాయుడు, మురళీ, ఎంపీటీసీ నాగరాజు, నాగవరం పీఏసీసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.