మల్దకల్, సెప్టెంబర్ 22: తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలు, కులమతాలకు తావులేకుండా అన్నివర్గాలవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. ప్రతిఇంటికీ ఏదోవిధంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. మండల కేంద్రంలో ఎంపీపీ రాజారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటన్న అధ్యక్షతన గురువారం ఆసరా పింఛన్లు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే బండ్ల, రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 57ఏండ్ల వయస్సు గల వారందరికీ పింఛను అందజేస్తున్నారన్నారు. మండలంలో కొత్తగా 1,224 పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త పింఛను కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, సింగి ల్విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రామన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ పెద్దవీరన్న, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మ న్ ప్రహ్లాదరావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, కోఆష్షన్ సభ్యుడు హైదర్ అలీ, తాసిల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అలంపూర్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందజేయనున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. గురువారం అలంపూర్లోని 9వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, సెప్టెంబర్ 22: ప్రతి ఇంటా ఆడబిడ్డలు ఆనందంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం సర్కారు కానుకగా బతుకమ్మ చీరను అందజేస్తున్నదని సర్పంచ్ గోవర్ధనమ్మ వెల్లడించారు. గురువారం మండలంలోని పులికల్లో మహిళలకు సర్పంచ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కిశోర్, డీలర్లు పాల్గొన్నారు.
మానవపాడు, సెప్టెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరలను మండలంలోని ఆయా గ్రామాల్లో ఎంపీపీ అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. గురువారం పల్లెపాడు, మద్దూరు, కలుకుంట్లలో మహిళలకు చీరలను అందించారు. అలాగే పల్లెపాడులో పింఛనుకార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, సర్పంచులు లక్ష్మీదేవి, ఆత్మలింగారెడ్డి, విజయమ్మ పాల్గొన్నారు.