ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : వైద్యం కోసం తిరిగే ప్రజల కష్టాలకు చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టణ, పల్లె రోగుల కోసం మరింత నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు ఉచితంగా మందులు అందించనుం ది. సామాన్యుడికి చేరువలో వైద్య సేవలందించే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణా ల్లో బస్తీ దవాఖానలు, గ్రామాల్లో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది.
జిల్లా పరిధి మండలాల్లో మొదటి దశలో 23 పల్లె దవాఖానలు మంజూరు కాగా వీటికి సిబ్బందినియామక ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో దశలో 10 బస్తీ దవాఖానలు, 19 పల్లె దవాఖానలు మం జూరు కాగా వీటి ఏర్పాటు పనులు, సిబ్బం ది నియామక ప్రక్రియ జరుగుతోంది. జిల్లా లో కొత్త గా రెండు బస్తీ దవాఖానలకు ఏ ర్పాట్లు జరుగుతున్నాయి. ఒకటి జిల్లా కేంద్రంలో కాగా మరొకటి ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు. మిగిలినవి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మారుస్తున్నారు. కేవలం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో కొనసాగే ఉపకేంద్రాల్లో అర్హత కల్గిన వైద్యులను నియమించి మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. 29మంది వైద్యులను నియమించేందుకు ఇప్పటికే జిల్లా వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తుల ప్రక్రియ సహితం ముగిసింది. ఎంబీబీఎస్ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉండగా రెండో ప్రాధాన్యతగా బీఏఎంఎస్(ఆయుర్వేదం) చేసిన వారికి అవకాశం కల్పించారు. ఎంబీబీఎస్, బీఏఎంఎస్లు అందుబాటులో లేనిపక్షంలో బీఎస్సీ నర్సిం గ్ ఏడాదిపాటు బ్రిడ్జి కోర్సు చేసిన వారికి ప్రా ధాన్యత ఇవ్వనున్నారు. వీరు అందుబాటు లో లేనిచోట స్టాఫ్నర్సులను విధుల్లోకి తీసుకోనున్నారు. అత్యవసర సమయంలో టెలీమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలందించేందుకు కూడా అవకాశం ఉంది.
వైద్య సేవలు పేదలకు అందుబాటులో ఉం డేందుకు ప్రవేశపెట్టిన బస్తీ, పల్లె దవాఖానల్లో అర్హులైన వైద్యులతోనే సేవలందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. మొదటి దశ లో ఆయుష్ వారితో పోస్టులను భర్తీ చేసినప్పటికీ రెండో దశలో పక్కాగా ఎంబీబీఎస్ వారినే భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఎంఎల్హెచ్పీ పోస్టులకు ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ లేదా నర్సింగ్, జీఎన్ఎంతో పా టు ఏడాది బ్రిడ్జి కోర్సు చదివిన వారినే భర్తీ చేసేందుకు వైద్యశాఖ నిర్ణయం తీసుకున్నది.
బస్తీ దవాఖానతో వాడవాడలా మెరుగైన వైద్యసేవులు అందుతాయి. అర్హత, అనుభవం కల్గిన వైద్యులను దవాఖానల్లో నియమిస్తున్నాం. శిశువులకు, గర్భిణులకు ఇమ్యూనైజేషన్ టీకాలు, ప్రసవం ముందు ప్రసవం తరువాత అందించే అన్ని రకాల వైద్యసేవలు ఇక నుంచి ఇక్కడే లభ్యమవుతాయి. దీర్ఘకాలిక వ్యా ధిగ్రస్తులు బీపీ, షుగర్ వారికి పరీక్షలు, మందులు అందజేస్తాం. వ్యాక్సినేషన్, అన్ని రకాల ఓపీ సేవలతోపాటు అత్యవసరమున్న కేసులను అవసరమైన దవాఖానకు సిఫారస్సు చేయబడతాయి. వైద్యుల దరఖాస్తుల ప్రక్రియ ముగియగా వాటి పరిశీలన జరుగుతోం ది. 29 వైద్య పోస్టులకు ఎంబీబీఎస్ రెండు, బీఏఎంఎస్ 89, బీఎస్సీ నర్సింగ్ 45, జీఎన్ఎం 93 దరఖాస్తులు వచ్చాయి. ఈనెలాఖరు వరకు వైద్యుల నియామక ప్రక్రియ పూర్తిచేసి వచ్చే నెలలో దవాఖానలను ప్రారంభిస్తాం. -రవిశంకర్, జిల్లా వైద్యాధికారి, వనపర్తి