తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జై తెలంగాణ నినాదం మార్మోగింది. జాతీయ పతాకాలను చేతబూని.., తెలంగాణ పాటలతో కూడిన డీజే చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ పోతుగంటి రాములు, విప్ గువ్వల బాలారాజు, జెడ్పీ చైర్మన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, లోకనాథ్రెడ్డి, పద్మావతి, సరిత, వనజ, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, నాయకులు, అధికారులు స్వచ్ఛందంగా హాజరయ్యారు.