నాగర్కర్నూల్, సెప్టెంబర్ 15 (నమ స్తే తెలంగాణ) : దేశంలో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ అంతర్భాగమైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల తో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను అట్టహాసం గా నిర్వహించనున్నారు. ఇందుకో సం కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి వ రకూ తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు రాష్ట్ర చరిత్ర, ఆవశ్యకత వివరించేలా ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్రం, గణతంత్రం, తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల మాదిరిగా వజ్రోత్సవాలు జరగనున్నా యి. 16వ తేదీన ప్రతి నియోజకవర్గ కేం ద్రంలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజలు భాగమయ్యేలా కలెక్టర్లు ఆయా శాఖలను ఆదేశించారు. ర్యా లీలో పాల్గొనే ప్రజలకు ప్రభుత్వం భోజనం ఏర్పాట్లు చేయనున్నది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. రెవె న్యూ శాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చే పట్టనున్నది. 17వ తేదీన జిల్లా కేంద్రాల్లో జా తీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథుల పేర్లను ప్రభుత్వమే నిర్ణయించి ఖరారు చేసింది. గత స్వాతంత్య్ర వేడుకలకు జెండాలు ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులే దాదాపుగా 17 వ తేదీన హాజరుకానున్నారు.
అదే విధంగా 17 న హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగే జాతీ య పతాకావిష్కరణ, సభకు ప్రజలు తరలివెళ్లనున్నారు. గ్రామాలు, పట్టణాల నుంచి మహిళ లు, యువత, గిరిజన ప్రతినిధులు, ఉద్యోగుల ను మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక బ స్సుల్లో చేరవేయనున్నారు. ప్రతి బస్సులో ఎంపీడీవోలను లైజనింగ్ అధికారిగా, పోలీస్ కానిస్టేబుళ్లను నియమించారు. అలాగే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. 18వ తేదీన కవులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సం బంధించి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆ యా జిల్లాల కలెక్టర్లు విధులను కేటాయించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు ఈ వేడుకలను భుజస్కంధాలపై వే సుకొని అధికారులతో సమీక్షిస్తూ సహకారం అందిస్తున్నారు. ఏడు దశాబ్దాల్లో తెలంగాణ తన అస్తి త్వం కోసం చేసిన పోరా టం, ప్రత్యేక రాష్ట్రంగా మారాక జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్ను దెబ్బతీసేలా జరుగుతున్న విధానాలను వివరించేలా వేడుకలను నిర్వహించేందుకు ఆదేశాలిచ్చారు. ప్రజాప్రతినిధులు వే డుకల విజయవంతానికి కృషి చేస్తున్నారు.
వజ్రోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న
వజ్రోత్సవ వేడుకలకు జిల్లాలో ఏర్పాట్లు
పూర్తి చేశాం. రెవెన్యూ, మున్సిపల్, ఇతర
అన్ని శాఖల అధికారులు 16, 17, 18వ తేదీల్లో
వేడుకలను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటారు. 16న నియోజకవర్గ కేంద్రాల్లో 15వేల మందితో భారీ ర్యాలీలో పాల్గొనే వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. 17వ తేదీన గ్రామాల నుంచి ప్రజలను హైదరాబాద్లో జరిగే వేడుకలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ వజ్రోత్సవాల్లో భాగం కావాలి. తెలంగాణ జాతీయ సమైక్యతను ప్రపంచానికి చాటాలి.
– ఉదయ్ కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్