మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ కర్త, స్వరాష్ట్ర స్వప్నాన్ని కేసీఆర్ సాకారం చేశారు. ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేవుడిగా మారారు. గ్రామల్లో నీటి వనరులు, తాగునీటిపై తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజాప్రతినిధులంటే గౌ రవం పెరిగేలా చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావాలని జెడ్పీటీసీలు ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ వస్తే జాతీయ పార్టీలన్నీ తమ దుకాణాలు మూసేయడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
మిషన్ కాకతీయతో మహర్దశ..
ఎప్పుడో కాకతీయులు తవ్విన చెరువులను ఉమ్మడి రా ష్ట్రంలో పట్టించుకోలేదు. చెరువులనే కబ్జా చేయాలని ప్ర యత్నిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో మి షన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా చెరువుల పునరుద్ధరణ చేసి నీటి వనరులను ఒడిసి పట్టారు. రాజుల కాలంలో తాగు, సాగునీటి అవసరాల కోసం త వ్విన చెరువులు పూడుకుపోయి.., నీటి నిల్వలు తగ్గి, కట్టల మీద కంపతారు చెట్లు పెరిగిన దశలో మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. కేసీఆర్ సర్కార్లో చెరువులకు మ హర్దశ పట్టింది. పూడికతీత, కాలువల ఆధునీకరణ, తూ ముల మరమ్మతులు చేయడంతో నీ టి నిల్వ పెరిగింది. నేడు చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు పుష్కలంగా సా గునీరందుతున్నది. దీంతో రైతన్నలు ఆ నందం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ చలువ వల్లే సాధ్యమైందని.., విజన్ ఉన్న నేత దేశ రాజకీయాల్లోకి రావాలని జెడ్పీటీసీలు కోరుతున్నారు.
స్వచ్ఛమైన తాగునీరు..
గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతం. మహిళలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల మేర నడిచి బోరుబావుల వద్ద నీళ్లు తెచ్చుకునేవారు. సదరు భూ యజమానులు నీటిని కూడా తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ఈ సమస్యను పరిష్కరించలేక స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాలను వదిలే పరిస్థితి ఉండేది. ఇలాంటి తరుణంలో స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి ఎద్దడి లే కుండా చేసింది. ఇంటింటికీ నల్లా పథకం తీసుకురావడం తో పుష్కలంగా తాగునీరు అందుతున్నది. ఈ ఎనిమిదేండ్లల్లో తాగునీటి పథకం ప్రతి గ్రామానికి రావడంతో నీటి ఎద్దడి లేదు. ఇంతటి మహత్తర పథకం చాలా గొప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బంగారు తెలంగాణ సృ ష్టికర్త కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కేవలం గౌరవ వేతనం ఇచ్చి తగిన ప్రాధాన్యత ఇ వ్వకపోవడంతో మదనపడుతున్న జెడ్పీటీసీలకు స్వరాష్ట్రం లో గౌరవం పెరిగిందని అంటున్నారు. తమకు కూడా ఆఫీసులు కేటాయించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్ర జాప్రతినిధుల సాదకబాధకాలు తెలిసిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే దేశవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని చెబుతున్నారు.
దేశం దశ మారుతుంది..
సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణకు వలసపాలకుల నుంచి బంధ విము క్తి కల్పించి.., నెర్రెలు బా రిన నేలల్లో నీళ్లు పా రించి.., వలసలకు నిలయంగా మారిన జిల్లాను పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది.రైతులకు నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీలను అందించి దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగను చేశాడు. ఈ విధంగా రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో నంబర్వన్గా నిలిపాడు. మోదీ ప్రభుత్వం జీడీపీని 30 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లాడు. కేసీఆర్ పీఎం అయితేనే దేశం దశ మారుతుంది.
– భీమయ్య, జెడ్పీటీసీ, రేవల్లి
కేసీఆర్తోనే దేశాభివృద్ధి..
తెలంగాణలోని సంక్షే మ పథకాలు దేశమంత టా అమలు కావాలంటే సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుంది. దేశ అభ్యున్న తి, ప్రజల సంక్షేమం కో సం కేసీఆర్ జాతీయ రా జకీయాల్లోకి వెళ్లాలి. ఆ యన తీసుకునే నిర్ణయాలకు గ్రామ స్థాయి నుంచి మద్దతు తెలుపుతున్నాం. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడనున్న రాజకీయ పార్టీ అనతికాలంలోనే చరిత్ర సృష్టిస్తుంది. మోదీ ప్రభుత్వం వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డీ విరిచింది. ప్రభుత్వ రం గ సంస్థలు, కంపెనీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి సామాన్యులకు ఉపాధి లేకుండా చేసింది.
– అశోక్కుమార్గౌడ్, జెడ్పీటీసీ, ఊట్కూర్