జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 ఏండ్ల లోపు బాలబాలికలు, చిన్నారులకు ఆల్బెండజోల్ మా త్రలను గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు వేసి ప్రారంభిచారు. 1 నుంచి 2 ఏండ్ల పిల్లలకు సగం మాత్ర, 2 నుంచి 19 ఏండ్ల వయస్సు వారికి మాత్ర చొప్పున వేశారు. నారాయణపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లలకు కలెక్టర్ హరిచందన మాత్రలు వేశారు. పలువురు మాట్లాడుతూ ఆల్బెండజోల్తో పిల్లల్లో రక్త హీ నత, పోషకాహార లోపం, బరువు తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలను నివారించేందుకు దోహదమవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్లు, డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, డీఐవో శైలజ, హెల్త్ సూ పర్వైజర్ గోవిందరాజు, వైద్య సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్,సెప్టెంబర్15