గుండుమాల్, సెప్టెంబర్ 15 : ఆసరా పింఛన్లతో పేదలకు భరోసా కలుగుతున్నదని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మూర్లో ఆసరా పథకం లబ్ధిదారులకు పింఛన్కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ మంజూరు చేశామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేకూరుతున్నదన్నారు.
అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామానికి రూ.20లక్షలతో ప్రాథమిక వైద్య కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వ రలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, సర్పంచులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.