మహబూబ్నగర్, సెప్టెంబర్ 14: ఈ నెల 16నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్య తా వజ్రోత్సవాలను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వజ్రోత్సవాలపై మంగళవారం ప్రభు త్వం జీవోను విడుదల చేసిందని, జీవో ప్రకారం ముందు కు సాగాలని సూచించారు.
ఈ నెల 16న నియోజకవర్గ ప రిధిలో 15వేల మందితో ర్యాలీ నిర్వహించాలని, ర్యాలీలో పాల్గొనే వారికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. 17న ఉదయం 9గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లాకేంద్రంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకం ఆవిష్కరించాలన్నారు. 18న జిల్లాకేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. 17న ఉదయమే హైదరాబాద్కు గిరిజన ప్రతినిధులను పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించాలన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16, 17తేదీల్లో నిర్వహించనున్న వజ్రోత్సవాలకు పోలీస్ బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.