జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల నియోజకవర్గకేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని కాటన్ మార్కెట్యార్డు సమీపంలో జర్నలిస్టుల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణం చే స్తున్న కాంట్రాక్టర్తో మాట్లాడారు. పనులను వేగవంతం చేసి దసరా పండుగలోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం హౌసింగ్శాఖ పీడీతో ఫోన్లో మాట్లాడి డబుల్బెడ్రూం ఇండ్ల పనులపై పర్యవేక్షణ పెంచి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జర్నలిస్టులతోపాటు పేదలకు డబుల్బె డ్రూం ఇండ్లను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమలో జర్నలిస్టు సం ఘం నాయకులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్కు చెందిన రబియాబేగం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఆమె వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల ఎల్వోసీని జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన ఉడిత్యాల గ్రామస్తులు
బాలానగర్, ఆగస్టు 23 : మండలంలో ని ఉడిత్యాల గ్రామస్తులు హైదరాబాద్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కో రారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అలాగే యాదవ సంఘం నాయకుడు ప్రేంకుమార్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని పెద్దరేవల్లికి చెందిన వీరభద్రమ్మ (80) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి మండల నాయకులతో కలిసి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గ్రామానికి చెందిన వనమాల (26) ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు.