కృష్ణ, ఆగస్టు 15 : మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతిని టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని టైరోడ్ వద్ద ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి, నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడి ్డవిగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఎంపీపీ పూర్ణిమాపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయపాటిల్, టీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, ఆగస్టు 15 : మాజీ ఎమ్మెల్యే, స్వర్గీ య చిట్టెం నర్సిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సం దర్భంగా సోమవారం ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి నివాళులర్పించారు. మండలంలో వారి ఘూట్ల వద్ద పూలమాల వేసి రెండు నిమిషాలపాటు మౌనం పాటించి, వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రై తుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, యూ త్ మండల అధ్యక్షుడు సునీల్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.