నారాయణపేట టౌన్, ఆగస్టు 13 : పట్టణంలోని పరిమళపురంలో ఉన్న రాఘవేంద్రస్వామి మఠంలో శనివారం మధ్యారాధన పూజలు కనులపండువగా నిర్వహించారు. అర్చకులు రఘుప్రేమాచారి మంత్రోచ్ఛారణలతో సుప్రభా తసేవ, పంచామృతాభిషేకం, భజన, పల్లకీసేవ, మహా నైవే ద్యం, సర్వసేవా తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం హరిదాసుల సంకీర్తనల మధ్య పురవీధుల గుండా గోపాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవేంద్ర సేవా సమితి సభ్యులు నర్సింహ, ప్రసాద్, మంజునాథ్ జ్యోషి, హన్మేష్, రవితేజ, శ్రీనివాస్, అనంతరావు నర్సింహారావు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
మక్తల్ అర్బన్, ఆగస్టు 13 : మల్లికార్జునస్వామి దర్శనం మహాభాగ్యమని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్ అన్నారు. పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉ మామహేశ్వరంలో శివాలయాన్ని శనివారం కుటుంబ స భ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బిల్వ పత్రాలతో అర్చన చేసి స్వామివారి ఆశీర్వాదం తీ సుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, నాయకు లు పాల్గొన్నారు.
ఘనంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు
మద్దూర్, ఆగస్టు 13 : మండలంలోని భూనీడ్ ఆంజనేయస్వామి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహి ంచారు. ఆలయంలో ప్రతి ఏటా శ్రావణమాసం సందర్భం గా మూడో శనివారం స్వామివారికి జల్దిబిందె కార్యక్రమం, పల్లకీసేవ, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అ నంతరం అన్నదానం చేశారు. జాతరకు పెద్దఎత్తున భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
మరికల్ మండలంలో..
మరికల్, ఆగస్టు 13 : మండలంలోని ఆది ఆంజనే యస్వామి, కిష్టంపల్లి ఆంజనేయస్వామి, ఎలిగండ్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో జల్దిబిందె, పల్లకీసేవ ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం మూడో శనివారం సంద ర్భంగా రథోత్సవం, జల్దిబిందె, పల్లకీసేవలను వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశా రు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకున్నారు.
మాగనూర్ మండలంలో..
మాగనూర్, ఆగస్టు 13 : మండలంలోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో శనివారం జల్దిబిందె కార్యక్రమాన్ని గ్రా మస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామం నుంచి కృష్ణ మండలం ముడుమాల్ గ్రామం కృష్ణానది వరకు స్వామిని పల్లకీ సేవలో తీసుకెళ్లి పుష్కర స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఎంపీ పీ శ్యామలమ్మ, ఉపసర్పంచ్ సుధాంజనేయులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.