నవాబ్పేట, ఆగస్టు 10 : మండలంలోని యన్మన్గండ్ల పెద్దచెరువుకట్ట గండితో నష్టపోయిన ఆయకట్టు రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని యన్మన్గండ్ల పెద్దచెరువు కట్టను బుధవారం పరిశీలించారు. చెరువుకట్ట తెగిపోవడానికిగల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రైతులెవరూ అ ధైర్యపడొద్దని, అండగా ఉంటానని భరోసా కల్పించారు. చెరువుకట్ట తెగిపోవడంతో ఇసుక మేటలు వేసి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. చెరువుకట్ట మరమ్మతు పను లు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అదనపు కలెక్టర్ సీతారామారావు చెరువుకట్టను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఏవో వెంకటేశ్వర్లు, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, తాసిల్దా ర్ రాజేందర్రెడ్డి, ఏవో కృష్ణకిశోర్, సర్పంచ్ గోపాల్గౌడ్, నాయకులు కృష్ణగౌడ్, అంజయ్య, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.