కోయిలకొండ/బాలానగర్, ఆగస్టు 8 : మత సామరస్యానికి ప్రతీకగా, హిందూ, ముస్లింలు కలిసి జరుపుకొనే మొహర్రం వేడుకలు గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పీర్ల మసీదుల్లో సవార్లు కొలువుదీరగా ఉదయం, సా యంత్రం ముజావర్లు ప్రత్యేక పూజలు చేస్తున్నా రు. భక్తులు సవార్లకు పూలు, ఊదు, బెల్లం, దట్టీ లు సమర్పించుకుంటూ మొక్కలు చెల్లించుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది. తొమ్మది రోజులపాటు సవార్లను కొలిచి పదో రోజు (బుధవారం) నీటిలో నిమజ్జనం చేసి వేడుకలను కోలాహలంగా ముగించనున్నారు.
వైభవంగా బీబీ ఫాతిమా ఉత్సవాలు..
‘అమ్మరో భీమమ్మ.. మా తల్లిరో భీమమ్మ’ అం టూ హిందూముస్లింలు ఐక్యతగా జరుపుకొనే కో యిలకొండ బీబీ ఫాతిమా పీర్ల పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు అ త్యంత వైభవంగా నిర్వహించే బీబీ ఫాతిమా ఉత్సవాలకు తెలంగాణతోపాటు కర్ణాటక, ఏపీ రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లికి కందూర్లు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఖిల్లాగుట్టపై భీమమ్మ పీరు ను ప్రతిష్ఠించారు. బీబీ ఫాతిమా పీరుతోపాటు మొ గులాలి, డాల్సాబ్, గండెల్సాబ్, ఉషన్పాషా, ఖాసీమ్సాబ్, చాన్దూల పీర్లు కొలువుదీరాయి. బీబీ ఫాతిమా భర్త మొగులాలి యుద్ధంలో మృతి చెందగా.. అతడి మరణ వార్తను మొగులాలి చేతి లో ఉన్న డాల్సాబ్ బీబీ ఫాతిమా పీరు చెప్పే సం దర్భం ఎంతో ఆకట్టుకుంటున్నది. భర్త మరణ వా ర్తను వినకూడదని.. బీబీ ఫాతీమా పీరు తప్పించుకొని ఖిల్లా గుట్టకు వెళ్లే సందర్భం కనివిందు చేస్తున్నది. కోయిలకొండలో ప్రతిష్ఠించిన పీర్లతోపాటు పార్పల్లి, అంకిళ్ల, ఇబ్రహీంనగర్, అనంతాపూర్ పీర్లు ఖిల్లాపై ఉన్న బీబీ ఫాతిమా పీరును సవార్లతో దర్శించుకొని వెళ్తాయి.