పేదలకు ప్రభుత్వం ఊరట కల్పించేలా నిర్ణయించింది. రేషన్ దుకాణాల నుంచి 15కిలోల బియ్యం పంపిణీకి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. దీంతో ఈనెలలో రేషన్ కార్డుదారు లకు బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపుగా జిల్లాలకు బియ్యం కోటా చేరుకున్నది.
నాగర్కర్నూల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పేదలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకున్నది. రేషన్ దుకాణాల ద్వారా 15కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. దీంతో గురువారం నుంచి రేషన్కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి కార్డుదారుడికి 15కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ జరగనున్నది.
కరోనాతో గతంలో నిలిచిపోయిన బియ్యం పంపిణీని ఈ నెలలో చేపట్టేందుకు ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశించింది. ఆహార భద్రతలో భాగంగా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా బియ్యం అందజేయడం జరుగుతున్నది. కిలో రూ.1చొప్పున ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యం పంపిణీ జరుగుతున్నది. కాగా, కరోనాతో నిలిచిపోయిన బియ్యం కోటాను ఈ నెలలో భర్తీ చేయనుండటం గమనార్హం. దీనిపై ఇటీవలే పౌరసరఫరాల శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో జిల్లాలకు కావాల్సిన కోటా బియ్యం కూడా దాదాపుగా చేరుకున్నది.
సమైక్య పాలనలో కార్డుకు 20కిలోలు మాత్రమే ఇవ్వడం జరిగేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున అందజేస్తుండటం జరుగుతున్నది. కాగా, కరోనాతో నిలిచిపోయిన ఒక నెల బియ్యం కోటాను ఈ నెలలో 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కొనసాగించనున్నారు. దీనికిగానూ ఇప్పటికే జిల్లాలకు దాదాపుగా బియ్యం కోటా చేరుకున్నది. ఆయా దుకాణాల్లో రేషన్కార్డులను బట్టి బియ్యం కోటా రేషన్ దుకాణాలకు చేరడం దాదాపు పూర్తయ్యింది. ఈ నెల 4వ తేదీనుంచి ప్రారంభించి 15రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పేదల ఆర్థిక స్థితిగతులను బట్టి బియ్యం కోటా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై సివిల్ సైప్లె అధికారులు డీలర్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నారు.
డీలర్లు కూడా ఇప్పటికే డీడీలు చెల్లించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 20మండలాల్లో 558రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల పరిధిలో అన్నపూర్ణ కార్డులు 40ఉండగా, అంత్యోదయ కార్డులు 18,802 ఉన్నాయి. ఇక అత్యధికంగా ఆహార భద్రత కార్డులు 2,19,999చొప్పున జిల్లాలో మొత్తం 2,38,842కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా ప్రతి నెలా 7.66లక్షల మందికి బియ్యం పంపిణీ జరుగుతున్నది. కాగా, జిల్లాకు ఈ నెలలో పంపిణీ చేసేందుకు గానూ 11,87 8మెట్రిక్ టన్నుల బియ్యం చేరుకున్నది. ఆయా రేషన్ దుకాణాలకు గోదాంల నుంచి బియ్యం చేరవేయడం పూర్తయింది. ఈ నెల 4నుంచి అన్ని దుకాణాల్లో రెండు వారాలపాటు బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెలలో 15కిలోల బియ్యం పంపిణీ చేపడుతుండటంపై పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిఒక్కరికీ 15కిలోల బియ్యం
కరోనాతో నిలిచిపోయిన బియ్యం పంపిణీని ఈ నెలలో అందించడం జరుగుతుంది. జిల్లాలో 2.38లక్షల రేషన్కార్డులకు గానూ 11,878మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బియ్యం రేషన్ దుకాణాలకు చేరవేయడం జరిగింది. గురువారం నుంచి 19వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుంది.
– మోహన్బాబు, సివిల్ సఫ్లయి అధికారి, నాగర్కర్నూల్ జిల్లా