నారాయణపేట టౌన్, మే 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సో మవారం మహబూబ్నగర్ నుంచి వెబెక్స్ నుంచి పేట, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సూచనలు అందజేశారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మే రకు జూన్ 2న ప్రారంభించేందుకు మండలానికి 2 క్రీడా మైదానాలు సిద్ధం చేశామని, ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని కోరారు. పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు సిద్ధం చేశామని, గ్రామస్థాయి ప్రత్యేకాధికారులకు జాబితా అందజేశామన్నారు. వైకుంఠధామాలకు విద్యుత్, మంచినీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన సూ చనలు తప్పకుండా అమలు చేస్తామని ఆమె తెలిపారు. జె డ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ మాట్లాడుతూ వైకుంఠధామా లు, సెగ్రిగేషన్ షెడ్డులను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్లాంటేషన్ రోడ్డుకు ఎన్ని ఫీట్ల దూరం నుంచి మొక్కలు నాటాలో అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ పని చేసిన డబ్బులు రాలేదని కొందరు సర్పంచులు నిరుత్సాహంతో ఉన్నారని, బిల్లులు త్వరగా అమలు అయ్యేలా చూడాలన్నారు. స్పందించిన కలెక్టర్ బిల్లులు పెండింగ్లో ఉంటే పంపాలని, ఫిబ్రవరిలో రిజెక్ట్ చేసిన బిల్లులు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. స మావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జెడ్పీ సీఈవో, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజల్లో సాధారణ కాన్పులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో గైనకాలజిస్ట్లు, పురోహితులతో సోమవారం స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రస్తుతం సమాజంలో పుట్టబోయే అమ్మాయి, అబ్బా యి మంచి జాతకంలో పుట్టాలన్న తపనతో గర్భిణులు నవమాసాలు నిండక ముందే పురోహితుల వద్దకు వెళ్లి ము హూర్తాలు తెలుసుకొని ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేయిస్తున్నారని చెప్పారు.
మూఢాచారాలతో గర్భిణులకు నెలలు నిండక ముందే ప్రసవాలు చేస్తే సాధారణ కాన్పుల శాతం తగ్గడంతోపాటు పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. కాన్పు కోసం వచ్చిన వారు ముహూర్తం ప్రకారం చేయాలని ఒత్తిడి చేసినా చేయరాద ని, నెలలు నిండిన తర్వాతే చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవే ట్ దవాఖానల్లో సాధారణ కాన్పులే చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్లు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ దవాఖానలో మగ పిల్లలు పుట్టే శా తం ఎక్కువగా ఉందని, అలాంటి దవాఖానలపై ప్రత్యేక దృష్టి సారించి, అలాంటి వాటిని ప్రోత్సహించిన దవాఖానల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో రాంమనోహర్రావు, డిప్యూటీ డీఎంహెచ్వో శైల జ, మాస్ మీడియా అధికారి హనుమంతు, ప్రైవేట్ దవాఖానల డైరెక్టర్లు, వైద్యులు పాల్గొన్నారు.