మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21వ తేదీన అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, మండలాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరారు. హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, డీఎస్వోలు, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా 21న పెద్దఎతున మొ క్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 230కో ట్ల మొక్కల లక్ష్యానికిగానూ 264కోట్ల మొక్క లు నాటినట్లు చెప్పారు. 8వ విడుత హరితహారంలో 20కోట్ల మొక్కల లక్ష్యానికిగానూ 3వ వంతు పూర్తి చేశామన్నారు. లక్ష్యానికి అనుగుణంగా 21వ తేదీన మొక్కల ను నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రా మపంచాయతీల్లో 15వేలకుపైగా నర్సరీలు ఉన్నాయని, వాటి నుం చి మొక్కలు తీసుకుని అర్బన్ పార్కులు, రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాలు, చెరువుగట్లు, ఖాళీ స్థలా ల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలని తెలిపారు.
మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అటవీ, డీఆర్డీవో, పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. 21న జిల్లావ్యాప్తంగా 5లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వీసీలో అదనపు అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, ఏపీ డీ జకియాసుల్తానా, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్కుమా ర్, నూరుల్నజీబ్, మహమూద్షేక్, నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీధర్, డీఈ మనోహర్ తదితరులు ఉన్నారు.