గద్వాల ఏరియా ఆసుపత్రి..ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్సకు తప్పా ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు..ప్రతి చిన్న వైద్యానికి కూడా కర్నూల్, హైదరాబాద్, మహబూబ్నగర్ రెఫర్ చేసేవారు. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది..ఏరియా ఆసుప్రతి జిల్లా దవాఖానగా మారింది. వైద్యులొచ్చారు..అన్ని రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. 50పైగా పరీక్షలు ఉచితంగా చేసేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్ సైతం ఏర్పాటు చేశారు. 100 పడకల జిల్లా దవాఖానకు అదనంగా మరో 200పడకలు మంజూరు చేసింది. ఐదు ఎకరాలను నర్సింగ్ కళాశాలకు కేటాయించి, 34ఎకరాల్లో 300పడకల దవాఖాన నిర్మించనున్నారు. వీటితోపాటు 10 పడకల ఐసీయూ..10బెడ్స్తో డయాలసిస్ సేవలందుతున్నాయి.
గద్వాల, ఆగస్టు 1 : గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గద్వాల ప్రాంతం అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. రాష్ట్రంలోనే చి ట్టచివరి స్థానంలో నిలిచింది. వైద్యపరంగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. గద్వాల దవాఖానకు వచ్చిన వారిని ఇక్కడి వైద్యులు కర్నూల్ లేదా హైదరాబాద్కు రెఫర్ చేసేవారు. ఈ క్రమంలో నడిగడ్డపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సా రించడంతో వైద్య రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వంద పడకలతో ఉన్న ఏరియా దవాఖానను జిల్లా దవాఖానగా మార్చారు. దీంతో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు స్థాని కంగానే అందుతున్నాయి.
గతంలో జ్వరం వచ్చినా.. ప్రైవేట్ ల్యాబ్లకు టెస్ట్ల కోసం వె ళ్లి వేలకు వేలు చెల్లించేవారు. దీంతో టెస్టులు చేయించుకునేందు కు రోగులు ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లా దవాఖానలో డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసింది. 57 రకాలకు సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్న ది. అలాగే మందులను కూడా ఉచితంగానే అందిస్తున్నది.
గతంలో రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే మహబూబ్నగర్ లేదా హైదరాబాద్కు వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో వ్యయప్రయాసాలు పడేవారు. నేడు ప్రభుత్వ దవాఖానలోనే పది బెడ్స్తో కూడిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నది.
అత్యవసర చికిత్సలందించేందుకు జిల్లా దవాఖానలో ఐసీ యూ కేంద్రం ఉండేది కాదు. దీంతో ప్రమాదాల బారిన పడిన వారిని వేరే చోటకు రెఫర్చేయడంతతో ప్రాణాలు కోల్పోయే వారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న సర్కార్.. జిల్లా దవాఖానలో 20 పడకలతో కూడిన ఐసీయూ సెంటర్ ఏర్పాటు చేసింది. అత్యవసర చికిత్సలు అందిస్తున్నది.
గతంలో ఈ ప్రాంత విద్యార్థులు నర్సింగ్ చదవాలంటే వేరే చోటకు వెళ్లేవారు. ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. ఇ బ్బందులకు గుర్తించిన సర్కార్ జోగుళాంబ గద్వాల జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు చేసింది. కళాశాలను ప్రైవేట్ భవనంలో ప్రారంభించారు. ఇప్పటికే ఆన్లైన్ అడ్మిషన్లు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి ఏడాది 100 మంది విద్యార్థినులకు అవకాశం కల్పించారు. వారికి హాస్టల్ వసతి కూ డా ఉన్నది. కళాశాల శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఐదెకరాల స్థలాన్ని కేటా యించగా.., వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ప్రస్తుతం జిల్లా దవాఖానలో వంద పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా మరో 200 పడకలను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం దవాఖాన ఉన్న చోట స్థల ప్రభావం కారణంగా దౌదర్పల్లి దర్గా వద్ద 39 ఎకరాలు ఉండగా.. ఐదెకరాల్లో నర్సింగ్ కళాశాలకు కేటాయించారు. మిగతా 34 ఎకరాల్లో 300 పడకల దవాఖాన నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.43 కో ట్లు మంజూరు చేసింది.