మహబూబ్నగర్ టౌన్, జూలై 3 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యా వ్యవస్థతోపాటు అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాడినపడుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యను అందిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి సత్తాచాటుతున్నారు. గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,735 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. జనరల్ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్లో ఎంపీహెచ్డబ్లూ, ఎంఎల్టీ, ఈటీ, ఏఈటీ, సీటీ, సీజీఏ, సీఎస్, ఏటీ, ఆర్ఎం, ఎల్ఎండీటీ, టైలరింగ్ తదితర కోర్సులు ఉన్నాయి. మహబూబ్నగర్, జడ్చర్లలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉన్నాయి. జిల్లాలో 13 కళాశాలలు ఉండగా, 8 కళాశాలల్లో జనరల్ ఇంటర్, మిగతా కళాశాలల్లో ఇంటర్, ఒకేషనల్ ఉండగా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒకేషనల్ కళాశాల ప్రత్యేకంగా ఉంది. 2021-22 విద్యాసంవత్సరంలో జనరల్, ఒకేషనల్లో 5,735, రెండో సంవత్సరంలో ఇంటర్, ఒకేషనల్ కోర్సులో 4,746 మంది మొత్తం 9,149 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాల పెంచేందుకు పది ఫలితాల కంటే ముందే స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం జిల్లా ఇంటర్మీడియట్ శాఖ స్పెషల్డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల బృందం ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తిరిగి విద్యార్థుల ప్రవేశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాటు చేసి కళాశాలల్లో ఉన్న కోర్సుల వివరాలతోపాటు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఉచిత విద్యతోపాటు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వమే అందజేస్తున్నది. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధనలు అందిస్తూ మంచి ఫలితాలను కళాశాలలు సాధిస్తున్నాయి. ప్రతి ఏడాది విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు వివిధ కోర్సుల్లో రాష్ట్ర, జిల్లాస్థాయిలో మంచి ఫలితాలు సాధించి సత్తాచాటారు.
పాలమూరు మెడికల్ హబ్గా అభివృద్ధి చెందుతున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలో డాక్టర్ శామ్యూల్ ఎస్ఎస్ దవాఖానలో ఐసీయూ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పా లమూరులో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వసున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వై ద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, వైద్యులు ప్రణ య్, వివేక్, సుహాసిని, శరత్చంద్ర, వంశీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న కొత్తమొల్గరలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కొత్తమొల్గరకు చెందిన అర్జున్ (22) గ్రామంలో టీకొట్టు ఏర్పాటు చే సుకొని జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు.
ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకొని పేదలను ఆదుకోవాలని సీఐ హన్మప్ప అన్నారు. జి ల్లాకేంద్రంలోని బోయపల్లిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన చీరలు, హ్యాండ్స్టాండ్లను ఆదివారం వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయం చేయాలనే తపన ఎంతో మంచిదని, అభిలాష హెల్పింగ్ హాం డ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సరోజమ్మను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బాబన్న, నర్సింహులు, వర్షిణి, హర్షిత, ప్రవీణ్కుమార్ ఉన్నారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి నగదు చోరీ జరిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. మండ లంలోని కొత్తపల్లి గ్రామ శివారులో రేణుక వైన్స్ షాపు నిర్వాకుడు అశోక్ ఎ ప్పటిలాగే శనివారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో కొత్తపల్లి వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనాన్ని నిలిపివేశారు. కం ట్లో కరం కొట్టి అతడి వద్ద ఉన్న రూ.1,75,000నగదును ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫి ర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. గతేడాది మొదటి సంవత్సరంలో దాదాపు 6వేల మంది విద్యార్థులు చేరారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఆయా మండలాలు, గ్రామాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. అడ్మిషన్లు అవుతున్నాయి, కళాశాలల్లో చేరే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మేరుగైన విద్యాను అందిస్తున్నాం. ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారు. విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
-వెంకటేశ్వర్లు, డీఐఈవో, మహబూబ్నగర్