నాగర్కర్నూల్, జూన్ 22: అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, అందులో ప్రజాప్రతినిధులను త ప్పనిసరిగా భాగస్వాములను చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతీబంగార య్య పేర్కొన్నారు. జెడ్పీ 1వ, 7వ స్థాయీసంఘాల సమావేశాలను జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. బుధవారం స్థానిక జెడ్పీకార్యాలయంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి, జిల్లా మైనార్టీ సంక్షేమం, జిల్లా గిరిజన అభివృద్ధి, మిషన్ భగీరథ, ఆర్థిక ప్రణాళిక, జిల్లా మైనార్టీ సంక్షేమం, జిల్లా గిరిజన అభివృద్ధి, మిషన్ భగీరథ, ఆర్థికప్రణాళిక, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, జిల్లా రహదారులు, భవనాలు, నీటి పారుదల శాఖల అభివృద్ధి, పురోగతి, కొత్తగా ప్రతిపాదనలు జరిగిన పురోగతి పనుల వివరాలపై సమీక్షించారు.
ముందుగా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకుండా పనిచేస్తున్నారని, అభివృద్ధి పను లు, కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదని, దీనికి బాధ్యులెన వారిపై చర్యలు తీసుకోవాలని 6వస్థాయీసంఘం వైస్చైర్ పర్సన్ ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ప్రసాద్ డిమాండ్ చేశా రు. మంత్రుల కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ముందస్తు సమాచారం ఎంపీడీవోలు ఎందుకు ఇవ్వడంలేదని భరత్ప్రసా ద్ ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని వసతి గృహాలను సందర్శించినప్పు డు సంబంధిత వసతి గృహాలు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ప్రా రంభమైన సందర్భంగా అన్ని పాఠశాలలు అంగన్వాడీలకు మిషన్ భగీరథ నీటిని అం దించాలన్నారు. అదేవిధంగా మన ఊరు-మనబడి ద్వారా పాఠశాలల్లో చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. స మావేశంలో పాల్గొన్న సభ్యులు ఉప్పునుంతల జెడ్పీటీసీ అనంతప్రసాద్రెడ్డి, అచ్చంపే ట జెడ్పీటీసీ ముడావత్ మంత్య్రానాయక్లు ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పను ల వివరాలను సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
రోడ్లు భవనాల శాఖ ఈఈ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని 56 కిలోమీటర్ల రహదారులకు సెంట్రల్ రోడ్డు ఫండ్ ద్వారా రూ.72 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.దళితబంధు పథకం ద్వారా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో రూ.14కోట్లతో 142మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు వాహనాలను అందించినట్లు తెలిపారు. కోటి రూపాయలతో 18మంది లబ్ధిదారులకు వివిధ రకాల వ్యాపారాలు పెట్టుకునేందుకు అందించినట్లు తెలిపారు.
జూలై చివరి నాటికి నాలుగు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ అందజేస్తామని, చారకొండ మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ యూనిట్లను అందజేయనున్నట్లు తెలిపారు. మండలాల పరిధిలో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని ఆయా శాఖల అధికారులు వివరాలు జిల్లా ఉన్నతాధికారుల నివేదించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని జెడ్పీసీఈవో ఉష స్థాయీసంఘాల దృష్టికి తీసుకొచ్చారు.
వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సహాయ జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ అధికారి శ్రీధర్ కోరారు. కార్యక్రమంలో హాజరైన ఆయా శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. శాఖల అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం అందజేయాలని జెడ్పీచైర్పర్సన్ పద్మావతి అధికారులకు సూచించారు. సమావేశంలో సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.