వానకాలం సీజన్లో పెద్ద మొత్తంలో సాగవుతున్న పత్తిలో నూతన ఒరవడిని తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. అధిక సాంద్రత పద్ధతిలో తెల్లబంగారం పంటను సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ పద్ధతిలో ఎకరాకు20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. అందుకే గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఊరూరా సదస్సులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. సాధారణ సాగుతో పోలిస్తే అధిక సాంద్రతతో కలిగే లాభాలను వివరిస్తూ ఆర్థిక ప్రోత్సాహం కూడా కల్పిస్తున్నది. ఎకరానికి రూ.4 వేల రాయితీ అందించనున్నది.
నాగర్కర్నూల్, జూన్ 22 (నమస్తే తె లంగాణ) : వానకాలం సీజన్ వచ్చింది. రైతులు వరి, పత్తి, కందులు, మినుము లు వంటి పలు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పుడిప్పుడే తొలకరి జల్లులు కురుస్తున్నాయి. దీంతో అక్కడక్కడా రై తులు విత్తనాలు విత్తుతున్నారు. ఇందు లో పత్తి సాగు చేసే రైతులకు వ్యవసాయ శాఖ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. సాధారణ సాగుతో పోలిస్తే రైతులకు సాగులో ఇబ్బందులు తగ్గడంతోపాటు ఆర్థికంగా లబ్ధి కలిగించే ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. దీనికోసం ఆయా గ్రామాల్లో రైతులను ఎంపిక చే సేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అధిక సాం ద్రత పద్ధతి.. సాధారణ సాగు పద్ధతితో పోలిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణ పత్తి సాగులో ఎకరానికి రెండు ప్యాకెట్ల విత్తనాలు నాటుతారు. నూతన పద్ధతిలో ఐదు ప్యాకెట్ల విత్తనాలు నాటించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం రైతులకు న గదు ప్రోత్సాహంగా అందించనున్నది. ఎ కరాకు రూ.4 వేలను రైతు ఖాతాల్లో నే రుగా జమ చేయనున్నారు. ఈ సాగు చే పట్టే రైతులు మండల వ్యవసాయ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకొ ని, బ్యాంకు ఖాతా నెంబర్ను అందించా ల్సి ఉంటుంది.
ఇలా అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులకు విడుతల వారీ గా డబ్బులను జమ చేస్తారు. విత్తనాలు వేసే సమయంలో రూ.2,187, మొక్క పెరుగుదలకు రూ.500, పొలంలో కూలీ ల ఖర్చుకు రూ.1000, ఇతర ఖర్చులకు రూ.313 చొప్పున మొత్తం రూ.4 వేలు అందుతాయి. దీని కోసం వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నా రు. కాగా, రైతులు మధ్యకాలిక సన్నని రకాలను ఎంపిక చేసుకోవాలని, లూజ్ విత్తనాలు కాకుండా లైసెన్స్ దుకాణాల్లో ప్యాక్ చేసిన విత్తనాలు కొనుగోలు చేసి, రసీదు తీసుకోవాలి. దీంతో నకిలీ విత్తనా లు రావడానికి వీలుండదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 6.35 లక్షల సాధారణ సాగులో అధికంగా 4.40 లక్షల ఎకరా ల్లో పత్తి సాగవుతుండగా అధిక సాంద్రత పత్తి విధానంలో ప్రయోగాత్మకంగా 3,340 ఎకరాల్లో పత్తి సాగు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మహబూబ్నగర్ పురపాలిక శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి దుకాణానికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు షాపుల్లో స్టిక్కర్లు అతికిస్తున్నారు. ప్రతి దుకాణాదారుడికి అవగాహన కల్పించినట్లు రికార్డుల్లో సదరు షాపు యాజమాని సంతకాన్ని తీసుకుంటున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత మంగళవారం నిర్వహించిన డ్రైవ్లో రూ.9 వేల జరిమాన విధించారు.
పత్తి విత్తనాలను జూలై 15వ తేదీ వరకు నాటుకోవచ్చు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పత్తి పంట చేతికి వస్తుంది. ఈ పద్ధతి వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. రెండో పైరు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తక్కువ ఎత్తులో పెరిగే రకాలు, కొమ్మలు తక్కువ పొడవు ఉండే రకాలు, పంట త్వరగా కాపునకు వచ్చి ఒకేసారి పత్తి పగిలే రకాలు ఉంటాయి.. ఇందులో ఏవైనా ఎంచుకోవచ్చు. ఇక అందుబాటులో ఉన్న సాంకేతికతను పరిశీలిస్తే మొక్కల సాంద్రత వల్ల దిగుబడులు పెరుగుతాయి. పత్తి నాలుగైదు అడుగుల దగ్గర నియంత్రించడం వల్ల సస్యరక్షణ సులువు అవుతుంది.
సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ విధానంలో మధ్యస్త, తేలికపాటి నేలల్లో, ఎర్రభూములు, ఒండ్రు, ఇసుక నేలలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. 90.15 సెం.మీ, 75.20 సెం.మీ. దూరంలో మొక్కలు నాటుకోవాలి. సాధారణ పత్తి సాగులో ఎకరంలో 3 నుంచి 4 వేల పత్తి విత్తనాలు మాత్రమే నాటడం జరుగుతుంది. ఇందులో ఎకరాకు 25 వేల మొక్కలు వేసుకోవచ్చు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కలకు గాలి, వెలుతురు బాగా తగిలేందుకు మొక్కల ఎత్తు తగ్గించేందుకు రసాయన మందులు వాడొచ్చు. దీనికోసం మెపిక్వాట్ క్లోరైడ్ 5 శాతం మందును వాడాలి.
దీనిని 45, 65 రోజుల పైరుకు వరుసగా 200మిల్లీ లీటర్ల చొప్పున ఎకరాకు పిచికారీ చేయాలి. పైరు పెరుగుదలను బట్టి వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూనే 85 రోజులకు అవసరాన్ని బట్టి ఈ మందు పిచికారీ చేయాలి. పత్తి పైరు నాటిన 90-95 రోజులప్పుడు తల తుంచితే కాపుతో పాటు కాయ పరిమాణం పెరుగుతుంది. ఇందులో ఎన్సీఎస్-277 బీటీ-2 రకం అర్మిత విత్తనాలతో త్వరగా కాపు వచ్చి కాయలు ఒకేసారి పగులుతాయి. పింజ పొడవు అధికంగా ఉంటుంది. పత్తి తీయడం సులువు అవుతుంది.
మొక్కలు కాంపాక్ట్ ఉండి, విత్తేందుకు అనుకూలంగా ఉంటాయి. ఇక ఎన్సీఎస్-7788 బీటీ-2 రకం విత్తనాలు బరువైన పెద్ద పత్తి కాయతో, పత్తి తీసేందుకు సులువుగా ఉంటాయి. ఎన్సీఎస్-927 బీటీ-2 రకం విత్తనాలతో రసం పీల్చే పురుగుల ఉధృతి తట్టుకొంటుంది. తేలికపాటి, లవణ నేలల్లో వర్షాధార పరిస్థితుల్లో అధిక దిగుబడు వస్తుంది. అత్యధిక దూది శాతం కలిగి ఉంటుంది.