మహబూబ్నగర్ టౌన్, జూన్ 22 : ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మహబూబ్నగర్ పురపాలిక శాఖ శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా గతేడాది జూలై 1 నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు, ఉత్తత్తులపై కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం 75 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, గ్లాసులు, ప్లేట్లు అమ్మినా, వాడినా, నిల్వ చేసినా, దిగుమతి చేసుకున్నా, పంపిణీ చేసినా రూ.1000 నుంచి రూ.25 వేల జరిమానతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు.
దుకాణ యాజమానులు చెత్తను తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా విభజించడానికి తమ సొంత డబ్బాలను దుకాణం వద్ద ఏర్పాటు చేసుకోవాలి. షాప్నకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందజేయాలి. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి రూ.1000 నుంచి రూ.10,000 వరకు జరిమాన విధిస్తారు.