కొత్తకోట, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతుల కడుపు నింపుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కానీ 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాటి సీఎంలు వారి కడుపులే నింపుకున్నారని వి మర్శించారు. బుధవారం మండలంలోని వడ్డెవాట గ్రా మంలో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. 24 గంటల వి ద్యుత్, పెండింగ్తోపాటు కొత్త ప్రాజెక్టులు, రైతుబంధు, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టారన్నారు.
ఏ రాష్ట్రంలో అమలు కానీ పథకాలు ఇ క్కడ అమలవుతున్నాయని చెప్పారు. రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒకఛాన్స్ ఇవ్వాలని వేడుకోవడం సిగ్గు చేటన్నారు. నాడు అమలు కాని పథకాలు ఇప్పుడెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక చాన్స్ అంటూ రాష్ట్రమంతటా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని, వారి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ఓట్ల రాజకీయాలు చేయాలని, ఇప్పుడు చేస్తే ఏం ప్రయోజనమన్నారు. జూలై నుంచి కొత్త పింఛన్లు అమలవుతాయని తెలిపారు. అనంతరం కొత్తకోట మండలానికి చెందిన ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పాలెం గ్రామానికి చెందిన వెంకటన్నకు రూ. లక్షా 50 వేలు, స్రవంతికి రూ.లక్షా 50 వేలు, నాటవెల్లికి చెందిన చిన్న వెంకటయ్యకు రూ. లక్షా 25 వేలు, కనిమెట్టకు చెందిన చెన్నమ్మకు రూ.2.50 లక్షలు, రా మకృష్ణాపురానికి చెందిన సత్యనారాయణశెట్టికి రూ.60 వేల చెక్కులను అందజేశారు.
అలాగే 40 మంది లబ్ధిదారులకు రూ.40,04,640 విలువైన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచ్ సంధ్య, ఉమ్మడి జిల్లా ల అధికార ప్రతినిధి ప్రశాంత్, నాయకులు భీంరెడ్డి, నగేశ్, సత్యంయాదవ్, యుగేంధర్రెడ్డి, లక్ష్మణ్నాయక్, గోపాల్నాయక్, పద్మనెహ్రూ, లక్ష్మీకాంత్రెడ్డి, చెన్నారె డ్డి, నిర్మలారెడ్డి, వెంకట్రెడ్డి, సత్యంయాదవ్ ఉన్నారు.