జడ్చర్ల, జూన్ 22 : ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురై ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఉదండాపూర్, వల్లూరు గ్రామాలకు చెందిన పునరావాస ప్రాంతంలో రూ.కోటీ 80 లక్షలతో నిర్మించనున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నిర్మాణానికి, రూ.కోటీ 90 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణాలకూ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్తోపాటు పలు తండాల కోసం పునరావాస చర్యలు చేపట్టామన్నారు.
జడ్చర్ల మండలం దేవునిగుట్ట, బండమీదిపల్లి గ్రామాల మధ్య భూమిని సేకరించామని తెలిపారు. సామాజిక, ఆర్థిక గణన సర్వే పూర్తయితే ఇంటిస్థలాలు కేటాయిస్తామన్నారు. అర్హులైన వా రందరికీ త్వరలోనే స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా సమావేశం నిర్వహించి గ్రామస్తులందరూ ఓ నిర్ణయానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఈఎస్ సర్వేకు సహకరించడం లేదని, అందుకే సర్వే నిలిచిపోయిందన్నారు.
సర్వేలో 3 వేలకుపైగా పేర్లు ఇచ్చామని, కొందరి పేర్లు అధికంగా ఉన్నాయన్నారు. డీటీసీపీ లేఅవుట్ ప్రకారం 60 ఫీట్లు, 40 ఫీట్ల రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. ముంపు గ్రామాలకు దళితబంధుకు ముందుగా అవకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, ఆర్డీవో అనిల్కుమార్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, సర్పంచులు సువర్ణ మ్మ, రాజేశ్వర్రెడ్డి, రాములు నాయక్, ప్రభాకర్రెడ్డి, అశోక్గౌడ్, శ్రీను, మాజీ సర్పంచులు వెంకటయ్య, రా మాంజనేయులు, మాజీ ఎంపీటీసీ హనుమంతు, మహబూబ్పాషా, రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, దో నూరు శ్రీనివాస్రెడ్డి, గౌస్పాషా, వీరేష్, ముంపు గ్రా మాల ప్రజలు పాల్గొన్నారు.