మహబూబ్నగర్ మెట్టుగడ్డ: పాలమూరు పట్టణంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న ఓ కుటుంబం ఎమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చార్టడ్ అకౌంటెంట్ నెలకు లక్షల రూపాయల అదాయం, కూతురు సాప్టవేర్ ఇంజినీర్, కొడుకు మూడు నెలల క్రితం పైచదువుల కోసం ఆమెరికా వెళ్లాడు. మంగళవారం ఉదయం మాత్రం ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి(54), భార్య లత(48) దంపతులు. పాలమూరు పట్టణం లోని మదురానగర్ కాలనీలో నివాసం ఉంటు న్నారు. నర్సింహారెడ్డి పట్టణంలోని వైడి గుప్తా ట్రేడర్స్తో పాటు పలువురికి చార్టెడ్ ఆకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. భార్య గృహిణి, వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. మంగళవారం ఉదయం 7 .30 గంటల కూతురు జిమ్ కోసం బయటకు వెళ్లి తిరిగి 8.30 గంటల ఇంటికి వచ్చింది.
అప్పటికే తల్లిదండ్రులు ఇద్దరూ హాల్లోని కిటికికి బట్టల తీగతో ఉరేసుకుని ఉండటం గమనించి ఒక్కసారిగా రోదిస్తూ చట్టు పక్కల వాళ్లను పలిచింది. వాళ్లు వచ్చి కిందికి దించేలోపు చనిపోయి ఉన్నారు. విషయం పోలీసులకు చేర వేయడంతో రూరల్ ఎస్సై రమేశ్, పీఎస్సై సుజాతలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణా లను కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కొడుకు కెనడా నుంచి బుధవారం రానుండటంతో మృత దేహాలను జనరల్ దవాఖానలోని మార్చూరిలో భద్ర పరిచారు.
ఆత్మహత్యకు ఆనారోగ్యమే కారణామా.. ?
ఐదు పదుల వయస్సులో వీరి చావుకు ఆనారోగ్యమే కారణామా అని కుటుంబ సభ్యులు, స్థానికులు భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారని, ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణం కాదని చెబుతున్నారు. పాలమూరులో మూడం తస్తుల ఇంటితో పాటు ధర్మాపూర్ గ్రామంలో పొలాలు ఉన్నాయి.
కొనాళ్లుగా దంపతులు ఆనారోగ్య సమస్యలతో భాధ పడుతున్నారని చెబుతున్నారు. అయితే పెళ్లీడుకు వచ్చిన కూతు రు, కొడుకులకు పెళ్లిళ్లు చేయాల్సిన సమయంలో దంపతులు ఆనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకోవడం ఏంటనే ప్రశ్న లు తలెత్తున్నాయి.
ఎలాంటి ఆనారోగ్యం ఉన్నా వారికి మంచి జీవితాలను ఇచ్చి తమ బాధ్యతలను తీర్చుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో దంపతులిద్దరూ ఆత్మహత్యలకు ఇతర కుటుంబ కారణా లు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసు ల విచారణ జరుగుతోంది.
కొడుకు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయని అనుకుంటున్నారు. దంపతుల ఆత్మహత్య విషయం తెలిసి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున్న ఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.