కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, మే 29: ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద రైతులకు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతుల నుంచి ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్ యార్డు, ఇతర గోడౌన్లకు తరలించాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రభుత్వ గోడౌన్లతో పాటు ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని చెప్పారు. అవసరమున్నచోట గన్నీ బ్యాగులను సమకూర్చి ధాన్యంలోడ్ చేయడానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో కాళిందిని, సివిల్ సైప్లె అధికారులు శివప్రసాద్, హతీరాం పాల్గొన్నారు.