వనపర్తి రూరల్, జూన్ 27 : మండలంలోని రాజపే ట గ్రామశివారులో నిర్మాణమవుతున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ పనులను ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిగిలిన పనులను త్వర గా పూర్తి చేయాలని, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వా తావరణం ఏర్పడేలా మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించుకునే అవకాశం ఉన్నందునా అన్ని వసతులను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ ఉన్నారు.
ఎమ్మెల్యే ఆలతో రైతుబంధుపై ఆరా..
దేవరకద్ర నియోజకవర్గంలో రైతుబంధుపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో మంత్రి నిరంజన్రెడ్డి ఆరా తీశారు. ఆదివారం భూ త్పూర్ మున్సిపాలిటీలో మంత్రి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాల్లో ఎంత మంది రైతులకు డ బ్బులు అందాయన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ 59,334 మందికి గానూ 57,226 మంది ఖాతాల్లో రూ.69.47 కోట్లు జమ అయ్యాయన్నారు. కొన్ని ఇ బ్బందుల కారణంగా మిగతావారికి డబ్బులు రాలేదని, వారంలోగా వస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, వైస్ చైర్మన్ నారాయణగౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి వలసలు..
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోకి బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డు నాయకు డు మురళీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నంద, నాగమణితో పాటు పలువురు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ల క్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజలు ఎల్లప్పుడూ టీఆర్ఎస్ వైపే ఉంటారని గుర్తు చేశారు.