తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న కొడుకు
హత్య చేసి ఇంటి ఆవరణలోనే మృతదేహం పూడ్చివేత
వనపర్తి జిల్లా రామకృష్ణాపురంలో ఆలస్యంగా వెలుగులోకి..
కొత్తకోట, మే 23: మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ..ఇబ్బందులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన తల్లి తన పెగు బంధాన్నే తెంచుకున్నది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన హరిజన్ నాగమ్మకు పామాపురం గ్రామానికి చెందిన శాంతన్నతో వివాహం కాగా, 20ఏండ్ల కిందట భార్య నాగమ్మను వదిలేశాడు. నాగమ్మకు ఇద్దరు సంతానం. మొదటి సంతానం కూతురికి వివాహం చేసింది. రెండో సంతానం శివ(25) ట్రాక్టర్ డ్రైవర్గా ఉంటూ మద్యానికి బానిసై డ్రైవింగ్ మానేసి హమాలీగా జీవనం కొనసాగించేవాడు. కొన్ని రోజులుగా శివ తాగుడకు బానిసై నాగమ్మను హింసిస్తున్నాడు. భరించలేని తల్లి నాగమ్మ.. అమ్మమ్మ బుచ్చమ్మతో కలిసి ఈనెల 16న తాగిన మైకంలో ఉన్న శివను హత్య చేయాలని పథకం వేశారు. మద్యం మత్తులో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చివేశారు. శివను హత్య చేయడానికి ఇద్దరు మహిళలతో కాదని మరికొందరు ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో అధికారులు అందుబాటులో లేకపోవడంతో పూడ్చిన మృతదేహాన్ని బయటికి తీయలేకపోయారు. సోమవారం తాసిల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటికి తీస్తామని పోలీసులు తెలిపారు.
విషయం బయట పడిందిలా..
మృతుడు శివ ధాన్యం కొనుగోలు కేంద్రానికి హమాలీగా వెళ్తుండేవాడు. ఆదివారం తోటి కూలీలతో హమాలీగా వెళ్లి నాలుగు, ఐదు రోజులుగా పనికి రాకపోవడంతో ఇంటికి వెళ్లి నాగమ్మను అడిగారు. అందుకు నాగమ్మ తన కొడుకు ఎక్కడికి వెళ్లాడోనని ఆందోళనతో సమాధానం చెప్పింది. అనుమానం వచ్చిన కూలీలు సర్పంచ్ లత, గ్రామ పెద్దలైన వెంకటేశ్వర్రెడ్డి, భీంరెడ్డికి సమాచారం అందించారు. నాగమ్మను పిలిచి నీ కొడుకుతో పని ఉందని చెప్పగా, తన కొడుకును తానే చంపి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టానని చెప్పింది. ఆదివారం పోలీసులకు స మాచారం అందించడం తో ఇన్చార్జి సీఐ సీత య్య, ఎస్సై నాగశేఖర్రె డ్డి గ్రామానికి వెళ్లి ఘట నా స్థలాన్ని పరిశీలించా రు. శివను హత్య చేయడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి డీఎస్పీ కిరణ్కుమార్ చేరుకొని మృతదేహాన్ని పూడ్చిన ప్రాం తాన్ని పరిశీలించారు.