మూసాపేట, మే 18 : కరోనా బాధితులు వైద్యుల సూచనలు పాటించడంతోపాటు, తప్పనిసరిగా పౌష్టికాహా రం తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామశివారు లో ఉన్న పాలమూరు డెయిరీ నిర్వాహకులు ఏవీ రామకృ ష్ణ మండలంలోని కరోనా బాధితులకు ఉచితంగా భోజనం సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే ఆల ప్రారంభించారు. కరోనా బాధితులకు ఉచితంగా పోషకాలతోకూడిన భోజనం సరఫరా చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఏవీ రామకృష్ణ, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, సర్పంచులు శ్రీనివాసులు, శ్రీకాంత్, ఎంపీటీసీ నక్క ఆం జనేయులు, ఉపసర్పంచ్ అనిల్కుమార్రెడ్డి, శివరాములు పాల్గొన్నారు.
పేదలకు వరం ‘కల్యాణలక్ష్మి’
భూత్పూర్, మే 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క ల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 9 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పే దల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పే దింటి ఆడబిడ్డల పెండ్లికి తల్లిదండ్రులు ఇ బ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో కల్యాణల క్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం సంక్షేమ పథకాలను సజావుగా అమలు చే స్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బ స్వరాజ్గౌడ్, తాసిల్దార్ చెన్నకిష్టన్న, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఖాజా, అజీజ్, నాయకులు మనెమోని సత్యనారాయణ, అశోక్గౌ డ్ పాల్గొన్నారు.