సమిష్టిగా కృషి చేయాలి
జనరల్ దవాఖానలో 500 పడకలతో కొవిడ్ వార్డు
పది మంది రోగులుంటే గ్రామాలకే వైద్యులు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష
మహబూబ్నగర్, మే 15 : అందరం కలి సి కట్టుగా కరోనాను ఎదుర్కొందామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాల్ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా అవసరమైన చర్య లు తీసుకోవాలని సూచించారు. ధరల నియంత్రణ కూడా ఉండాలని ప్రైవేటు దవాఖానల్లో ఆక్సిజన్ రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఫీవర్ సర్వేలో క రోనా రోగులకు సంబంధించి గ్రామాలు, మం డలాల వారీగా పూర్తి వివరాలను సేకరించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అవసరం ఉంటేనే ఆక్సిజన్ను వినియోగించాలని అన్ని జిల్లాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 10మంది రోగులు ఉన్న చోటుకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేసి డాక్టర్లు గ్రామాలకు వెళ్లి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెండు రోజుల్లో 500 బెడ్లతో మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో పూర్తిస్థాయిలో కరోనా వార్డు సిద్ధం చేస్తామన్నారు. ఎస్వీఎస్లో 100పడకల ఐసోలేషన్ బెడ్లు ఉన్నాయని, మంగళవారం నాటికి షాద్నగర్లో 30 పడకల ఆక్సిజన్తో బెడ్లు కలిగిన దవాఖాన సిద్ధం అయితుందని తెలిపారు. ఆయా జిల్లాలోని డాక్టర్లు కొవిడ్ పేషెంట్లను ముందు ఐసోలేషన్లో ఉంచాలని, పరిస్థితి తీవ్రంగా ఉంటేనే మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు ఇతర దవాఖానలకు పంపించాలని తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కరోనా రోగులకు, సహాయకులకు భోజన సదుపాయాలను కల్పించాలని సూచించారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా భోజన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వలసకూలీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కరోనా రోగులు దైర్యం కోల్పోకుండా ఉండాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు దవాఖానల్లో కూడా ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. జెడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ సీసీకుంట మండలంలో అత్యధికంగా కేసులు నమోదు అయితున్నాయని, డాక్టర్కు ఒక సహాయకుడిని కేటాయించాలని కోరారు. వీడియోకాల్లో నారాయణపేట కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఎస్పీలు వెంకటేశ్వర్లు, చేతన, అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్ పవర్, సీతారామారావు, చంద్రారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ పాల్గొన్నారు.