దామరగిద్ద, జూన్ 13: నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషులు ప్రతి అవసరానికి వేగం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు మన బంధువులు దూర ప్రాంతం లో ఉన్న వారికి సమాచారం చేరవేయాలంటే ఉత్తరం ద్వా రానో ఇంకా త్వరగా కావాలంటే ప్రత్యేకంగా మనిషిని పం పించాల్సి వచ్చేది. ఆ తరవాత కొంత కాలానికి ల్యాండ్ ఫో న్ రాకతో నేరుగా మనకు కావాల్సిన వారితో సంభాషణ అవకాశం రావడంతో ఉత్తరాల సేవలు తగ్గుముఖం పట్టాయి.
సేవలలో వేగం పెరిగింది…
ప్రస్తుతం సెల్ఫోన్ వచ్చాక వాట్సాప్, ఫేస్ బుక్లతో మనిషి, మనిషి ఎదురెదుగా కూర్చుని మాట్లాడినట్లు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక బ్యాంక్ విషయానికి వస్తే ఒకప్పుడు దూర ప్రాంతాల వారికి డబ్బులు పంపాలంటే డీడీ తీసి వారికి పంపిస్తే వారు దానిని వారి అకౌంట్లో జమ చేసుకోవాలి, తరవాత పదిహేను రోజులకు వారి ఖాతాలకు వచ్చి చేరేవి, కానీ ఇప్పుడు ఫోన్పే, గూగుల్పే లాంటి సదుపాయాలు వచ్చిన తరవాత అకౌంట్ నెంబర్ లేకుండా కేవలం ఫోన్ నంబర్తో క్షణాల్లో డబ్బులు పంపే అవకాశం, సదుపాయం వచ్చింది. వేగంతోపాటు మోసా లు కూడా పెరిగాయి. సేవలలో వేగం పెరగడంతోపాటు ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి.
ఈ మోసాలలో వివిధ రకాలు
మీకు ఆన్లైన్లో ఫలానా పేరుమోసిన కంపెనీ నుంచి కోటి రూపాయల లాటరీ వచ్చిందని, అవి తీసుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్ కావాలని, అవి ఇచ్చిన తరవాత సదరు డబ్బులు మీ అకౌంట్కి రావాలంటే రూ.50వేలు కట్టమని, అవి కట్టిన తరవాత సదరు ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్లు ఆగిపోతాయి.
మీకు ఆరోగ్య శ్రీ కార్డు ఉందా ..ఉంది అంటే దానిని వాడటం లేదు కదా అందుకే ముప్పై వేలు మీ అకౌంట్కి వేస్తాం ఫోన్పే, కానీ గూగుల్పే కానీ ఉంటే నంబర్ చెప్పమని మన అకౌంట్లో ఉండే డబ్బులను ఖాళీ చేస్తారు.
ప్రస్తుతం అంటే గత వారంలో మండలంలోని ఓ వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడి ఫేస్బుక్ అకౌంట్ నుంచి మెసేజ్ పెట్టి రూ.12,500 డబ్బులు కావాలి నా ఫోన్పే లిమిట్ అయిపోయిందని పేర్కొన్నాడు. ఆ యువకుడికి అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఫోన్ చేయగా నేనేం అడుగలేదు.. నాకెందుకు డబ్బులు అనడంతో ఇది మోసం అని గ్రహించాడు ఆ యువకుడు.
చదువుకున్న వారు కూడా..
చదువులేని వారు మోసపోతున్నారు అంటే వారికి అవగాహన లేక మోస పోతున్నారని అనుకుందాం, కానీ ఈ మధ్యన చాలా మంది చదువుకున్న వారు కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం, ఏ బ్యాంక్ అధికారి అయినా సిబ్బంది అయినా మీ పర్సనల్ విషయాలు, ఓటీపి, ఏటీఎమ్ సీవీవీ, ఆధార్ లాంటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడానికి అడుగరు, ఇలాంటి కాల్ వచ్చింది అంటే మోసం అని గ్రహించి వారికి వివరాలు చెప్పకుండా ఫోన్ కట్ చేయడమే మంచిది, ఇంకా ఏమై నా వివరాలు కావాలంటే బ్యాంక్కు వచ్చి కలుస్తా మని చెప్పండి అంతే..
రవి సబావట్,
ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, దామరగిద్ద