కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, జూన్ 10 : నిత్యావసరాలను ప్రజలకు అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న వారందరికీ వ్యాక్సినేషన్ అందించడంలో మరింత వేగంగా ముందుకు తీసుకుపోతున్నామని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలోని ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. మరో మూడు వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచినట్లు కలెక్టర్ తెలియజేశారు. ప్రతి రోజు 650మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని, ఈ లక్ష్యాన్ని 1150కి పెంచినట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కొవిడ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతికదూరం పాటించాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, డెమో తిరుపతిరావు పాల్గొన్నారు.