ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ టౌన్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆరో నంబర్ రేషన్ షాపులో ఆపన్నహస్తం కింద పేదలకు 15 కేజీల బియ్యాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టపై ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. చెరువు తూము నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచించిన విధంగా నియోజకవర్గ ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు.
స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యత పెంచాలన్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడకూడదని తెల్ల రేషన్ కార్డుదారులకు 15 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అదేవిధంగా పెద్ద చెరువు తూము నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, కమిషనర్ రాజయ్య, ఏఈ నాగశివ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.