మహబూబ్నగర్/మెట్టుగడ్డ, జూన్ 1 : వైద్య రంగం లో మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా తీ ర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లాకు నూతనంగా మంజూరైన నర్సింగ్ కళాశాల ఏర్పాటుకుగానూ ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద మంగళవారం స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప క్కనే 15 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల నిర్మించేందుకు నిర్ణయించామన్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా న ర్సింగ్, సంబంధిత కాలేజీలు రావడం సంతోషంగా ఉం దన్నారు. నర్సింగ్ కళాశాలతో పాటు మహబూబ్నగర్ పట్టణంలోని పాత కలెక్టరేట్ వద్ద 10 ఎకరాల్లో నూతన దవాఖాన నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపన్నునట్లు తెలిపారు. హైదరాబాద్లో ఉన్నట్లుగానే మహబూబ్నగర్లో కూడా వివిధ ప్రాంతాల్లో పిల్లల దవాఖాన, ఇతర ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాని చెప్పారు.
పాత కలెక్టరేట్.. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండడంతోపాటు నగరం నడ్డిబొడ్డున ఉండడంతో పది ఎకరాల్లో నూతన దవాఖాన నిర్మిస్తే బాగుంటుందన్నారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్, ఫార్మసీ కాలేజీలు ఉండేలా ఇప్పటి నుం చే ప్రణాళికలు రూపొందించాలని మెడికల కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్కు సూచించారు. జిల్లాకు కర్టాటక, ఏపీ రాష్ర్టాల నుంచి వైద్యం కోసం వచ్చే అవకాశం ఉన్నందున.. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అన్ని దవాఖాన ల నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, కిశోర్, డీటీ రాజగోపాల్, ఆర్ఐ క్రాంతి తదితరులున్నారు.
ఉన్నత స్థాయికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబ్నగర్, జూన్ 1 : నిరుపేదలను ఉన్నత స్థా యికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గానికి చెందిన 29 మందికి సీఎంఆర్ఎ ఫ్ నుంచి మంజూరైన రూ.14.25 లక్షల విలువైన చెక్కులను బాధితులకు మంత్రి పంపిణీ చేశారు. అలాగే 9 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొ నుగోలు చేశామన్నారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువలు తీసేందుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. అంతకుముందు ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు, మున్సిపల్ సిబ్బందికి ప్రూట్ జ్యూస్ను పం పిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు, రెడ్క్రాస్ చైర్మ న్ నటరాజ్, బెక్కెం జనార్దన్ తదితరులు ఉన్నారు.