మరికల్, జూలై 17: మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు చేపడు తుండడంతో గ్రామస్త్తులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ఆనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణపనులు ఏవిధంగా చేపడుతారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్ 1లో తమకు భూములు ఉన్నాయని గ్రామస్తులు అక్రమంగా భూమిలో రాళ్లు పాతుతుండగా పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు పిలిచి వారిదగ్గర ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లు తీసుకొన్నారు. ఈ భూమిపై తాసిల్దార్ ఆధ్వర్యంలో సోమ వారం విచారణ జరిపిన తర్వాత భూమి దగ్గరకు రావాలని అంతవరకు భూమి దగ్గరకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సర్వే నెంబర్ 1లో ఆక్రమంగా నిర్మాణాలు చేస్తున్న విషయమై గ్రామస్త్తులు తాసిల్దార్ దయాకర్రెడ్డికి ఫోన్చేసి సమాచారం ఇవ్వగా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రభుత్వభూమిని ఆక్రమిస్తున్న విషయంపై తాసిల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, ఎవరు ఫోన్ చేసినా లిఫ్టు చేయకుండా ఉండడంతో గ్రామస్తులు తాసిల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత తాసిల్దార్కు లేదా ఆని ప్రశ్నించారు. నిర్మాణ పనుల దగ్గర వీఆర్ఏలు, తర్వాత ఆర్ఐ విజయ్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాంలా ల్, ఎస్సై అశోక్బాబు గ్రామస్తులతో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు.
ఆర్టీసీకి కేటాయించిన భూమిని అక్రమిస్తే ఎలా..
మరికల్ తాసిల్దార్ ఆర్టీసీ ఆధికారులకు 30గుంటల భూమి ఇచ్చారని, ప్రస్తుతం అట్టి భూమిని ఇతరులు ఆక్రమించడం తగదని ఆర్టీసీ ఆధికారులు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. సర్వే నెబంర్ 1 మొత్తం ప్రభుత్వ స్థలమని, ఇందులో 11 గుంటలు దేవాదాయ శాఖ వారిదని, గ్రామస్తులు అంటున్నారు. దేవాదాయశాఖవారు తమకు సర్వేనెంబర్ 1 లో 11 గుంటల భూమి ఉందని స్థానిక శివాలయం వద్ద నోటీస్ బోర్డుపై రాసినాకూడా కొందరు భూమి తమదేనని నిర్మాణ పనులు చేపడితే ఎలా ఆని గ్రామస్తులు ప్రశ్నిస్త్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఆర్టీసీ, దేవాదా యశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రభుత్వభూమిలో ప్రైవేటు వ్యక్తులెవరూ నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.