నాగర్కర్నూల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) :ఇకపై ప్లాస్టిక్ నిషేధం పురపాలికల్లో పకడ్బందీగా అమలుకానున్నది. పర్యావరణ కాలుష్యం, పరిశుభ్రత లోపానికి కారణాలైన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశంతో జూలై 1నుంచి ప్రతి మున్సిపాలిటీల్లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ వస్త్ర సంచులను ప్రోత్సహించడం, నిబంధనలు మీరితే భారీగా జరిమానాలు విధించేందుకు నడుం బిగించింది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 19పురపాలికల్లో ప్రతిరోజూ 310మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతుండగా అందులో 108మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
పర్యావరణ కాలుష్యానికి, పురపాలికల్లో పారిశుధ్య నిర్వహణకు ప్లాస్టిక్ వాడకం ప్రధాన అవరోధంగా మా రుతున్నది. కూరగాయల దుకాణాల నుంచి కిరాణాలు, హోటళ్లు, వస్త్ర వ్యాపారాలు.. పేర్లు ఏవైనా అమ్మే, కొనుగోలు చేసే వస్తుసామగ్రి, పార్సిళ్లు వంటి అన్నింట్లోనూ ప్లాస్టిక్ సంచులు, కవర్ల వాడకం ఎక్కువైంది. ఇక తాగునీళ్లు సైతం వివిధ రకాల కంపెనీల బ్రాండ్లతో ప్లాస్టిక్ కవర్లలోనే విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ క్రమంలో ఎ క్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నా యి. పట్టణాల్లో రోజూ సేకరిస్తున్న చెత్తలో అధిక భాగం ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ మాత్రమే ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహిత భారత్గా ఆవిర్భవిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దీంతో జూలై 1 నుంచి అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించేందుకు రాష్ట్ర పురపాలిక శాఖ నడుం బిగించింది. సింగిల్యూజ్డ్ వస్తువుల్లో ప్లాస్టిక్ బ్యాగులు, ప్లేట్లు, కప్పులు, నీళ్లు, సోడా బాటిళ్లు, ఫుడ్ ప్యాకేజీ కంటైనర్లు, స్ట్రాళ్లు, ఇన్విటేషన్ కార్డులు, ఇ యర్ బడ్స్, బెలూన్ స్టిక్స్, కత్తులు, గాజులు, 120 మైక్రా న్ల మందంలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ సామ గ్రి, ట్రేలు వంటి వస్తువులు ఉన్నాయి. కాగా, ఈ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని అధికారులు ఇప్పటికే వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వ్యాపారి వస్త్ర సంచులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే జరిమానాలు విధించనున్నారు.
దుకాణాల్లో మొదటిసారి ప్లాస్టిక్ బ్యాగులను వాడుతూ పట్టుబడితే రూ.2,500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇక ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడపడితే అక్కడ పారవేసే వ్యక్తులకు సైతం రూ.250 నుంచి రూ. 500 వరకు జరిమానా విధి స్తారు. ప్రజల్లో బాధ్యతను, భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ జరిమానాల ఉద్దేశం. మున్సిపాలిటీల్లో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పోలీస్ కానిస్టేబుళ్లతో కూడిన బృందాలు ఉంటాయి. ఈ బృందాలు ప్లాస్టిక్ వాడకంపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయి.
అలాగే వారంలో కనీసం రెండు సార్లు తనిఖీలు చే పడతారు. ప్రజలు మార్కెట్కు వెళ్లేటప్పుడు వస్త్ర సంచు లు తెచ్చుకోవడం, మాంసం టిఫిన్ బాక్సుల్లో, పాలకు క వర్ల బదులు తూగులు ఉపయోగించేలా అవగాహన క ల్పించనున్నారు. ఉమ్మడి పాలమూరులోని 19 పురపాలికల్లో నిత్యం 310 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతుండగా.. అందులో 108 మెట్రిక్ టన్నులు ప్లాస్టి క్ వ్యర్థాలే ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రస్తుతం ఈ నిషేధం 50 మైక్రాన్ల స్థా యిలో అమలవుతున్నా ఆశించినట్లుగా సాగడం లేదు. కొద్ది రోజులు జరిమానాలు, హడావుడితో ముగిసింది. అయితే, జూలై 1 నుంచి మాత్రం కచ్చితంగా అమలుచేసేలా పురపాలిక శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
రేపటి నుంచి జరిమానాలు..
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడితే భూసారం తగ్గి కలుషితమవుతుం ది. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ కష్టమవుతుంది. క్యా న్సర్, శ్వాసకోశ, కిడ్నీ, కాలే య సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది. డ్రైనేజీల్లో అధికంగా ప్లాస్టిక్ కవర్లు, సీసా లు పారవేస్తున్నారు. రేపటి నుంచి వ్యా పారస్తులు వస్త్ర సంచులనే వాడాలి. నాగర్కర్నూల్లో రోజూ 5 టన్నుల పొడి చెత్తలో దా దాపు 3 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటా యి. ప్లాస్టిక్ వాడినా, పారవేసినా జరిమానాలు విధిస్తాం. ఇప్పటివరకు రూ.1.50 లక్షల వరకు జరిమానాలు విధించాం. ప్లాస్టిక్ అమలు కోసం టాస్క్ఫోర్స్ బృందాలను నియమించాం. వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి.
– అన్వేష్, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్