మహబూబ్నగర్, జూన్ 29 : హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటడంతోపాటు సంరక్షణ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జిల్లాకేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని బుధవారం పరిశీలించారు. 8వ విడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో 441 నర్సరీల్లో కోటీ 30లక్షల మొక్కలు, అటవీశాఖ 16 నర్సరీల్లో 2,43,000, మూడు మున్సిపాలిటీల్లో 14 నర్సరీల్లో 8లక్షల 7వేల మొక్కలను పెంచుతున్నట్లు కలెక్టర్ వివరించారు. అత్యధికంగా మొక్కలను నా టేందుకు అనువైన స్థలాలను గుర్తించి గుంతలను తవ్వించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గణాంకదర్శిణి రూపొందించాలి
ప్రతి సంవత్సరం జిల్లా గణాంకదర్శిణిని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించా రు. 16వ జాతీయ గణాంక దినోత్సవం సం దర్భంగా కలెక్టర్ చాంబర్లో 2020-21 సంవత్సరానికి సంబంధించిన ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం రూపొందించిన జిల్లా గణాంకదర్శిణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా భౌగోళిక స్వరూపం, రెవెన్యూ, భూ ములు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరో గ్యం, సంక్షేమం తదితర అన్ని అంశాలతో జిల్లా గణాంకదర్శిణి రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితోపాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీ దశరథ, సీపీవో దశరథం పాల్గొన్నారు.
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
జూలై 3న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మెగా జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా జాబ్మేళాకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాబ్మేళా లో 60 కంపెనీలు సంవత్సరానికి రూ.80వేల నుంచి రూ.10లక్షల ప్యాకేజీమే ర జీతాలు ఉండే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. అభ్యర్థులు ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, ట్రైకన్సల్టెన్సీ ఎండీ మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.