కల్వకుర్తి/వంగూర్, జూన్ 6 : శాస్త్ర, సాంకేతిక పద్ధతులను అనుస రించి వ్యవసాయం చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరించేందుకు వ్యవసాయాధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటారని, వారి సలహాలు, సూచనలతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ అవతరించిందన్నారు. సోమవారం వంగూరు మండలం కోనేటిపూర్ సమీపంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన రైతు సదస్సుకు జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలిసి మంత్రి హాజరయ్యారు. అలాగే రంగాపూర్లో మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.2.20 కోట్లతో చేపట్టనున్న మౌలిక వసతులకు శంకుస్థాపన చేశారు.
శాస్త్ర, సాంకేతిక పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరించేందుకు వ్యవసాయాధికారులు ని రంతరం రైతులకు అందుబాటులో ఉం టారని, వారి సలహాలు, సూచనలతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. వంగూరు మండలం కోనేటిపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సాగులోని శ్రమ, రైతుల గొప్పతనం గురించి భావి తరాలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
లేకుంటే రాబోయే తరానికి తిండి గింజలు ఎలా పండుతాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పంటల సరాసరి ఉత్పత్తులతో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. డిమాండ్ మేరకు పంటలు సాగు చేయాలని, మూస పద్ధతులు వీడాలని సూచించారు. ఎనిమిదేండ్లలో వ్యవసాయానికి రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పా రు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడు లు, మార్కెటింగ్ వంటి అంశాలపై వ్యవసాయశాఖ రైతులకు శిక్షణ ఇచ్చేలా కా ర్యక్రమాలు రూపొందించి అమలు చే యనున్నట్లు వివరించారు. పత్తికి డి మాండ్ ఉన్న క్రమంలో పత్తి పంటలతో కంది పంటలను, యాసంగిలో నూనే ధాన్యాల పంటలు సాగుచేయాలన్నారు.
అంగ్లబోధనకు శ్రీకారం
రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచ పోటీని తట్టుకుని విజయం సాధించేలా ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే శ్రీకారం చుట్టామని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వంగూరు మండలం రంగాపూర్లో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.2.20 కోట్లతో చేపట్టనున్న మౌలిక వసతులకు శంకుస్థాపన, వంగూరు, తిప్పారెడ్డిపల్లిలో రూ.46 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలకు, నాబార్డు ద్వారా నిర్మించిన గోదాంను మంత్రి ప్రా రంభించారు.
40 మంది రైతులకు రూ.8.40 లక్షల విలువైన తుంపరసే ద్యం పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.9 వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్కుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, డీఏవో వెంకటేశ్వర్లు, పరిశ్రమల జిల్లా అధికారి రమేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నారాయణరావు, ఎంపీపీ భీమమ్మ, జెడ్పీటీసీ కేవీఎన్రెడ్డి, భరత్ప్రసాద్, రాంబాబు, ప్రతాప్రెడ్డి, వ్యవసాయ శా ఖ అధికారులు, డీఈవో గో విందరాజు లు, పీఆర్ ఈఈ దామోదర్రావు, డీపీ వో కృష్ణ, సర్పంచ్ ఝాన్సీ పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి..
వంగూరు మండలంలోని మాచినేనిపల్లికి చెందిన కాంగ్రెస్ మండల నాయకుడు జైపాల్రెడ్డితోపాటు మరో పది మంది కార్యకర్తలు మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వం గూరు మండల కేంద్రంలో చేరిన నాయకులకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎంపీ రాములుతోపాటు మంత్రి కండువాలు కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేందర్రెడ్డి, నేతలు గణేశ్రావు, రాజేందర్రెడ్డి, పుల్లయ్య, హరినాథ్ పాల్గొన్నారు.