అయిజ, మే 26 : వ్యవసాయ భూములు రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమవుతున్నాయి. ఫలితంగా దిగుబడులు ఏటేటా తగ్గుముఖం పడుతున్నా యి. 30 ఏండ్ల కిందట వచ్చిన దిగుబడులే నేడు వస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారు. బస్తాల కొద్దీ రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నా.. పెట్టుబడులు రాని ధైన్యం నెలకొన్నది. పంటలకు 16 రకాల పోషకాలు అవసరమని, రైతులు వాడుతున్న ర సాయనిక ఎరువులతో కేవలం ఒకటి, రెండు పోషకాలు మాత్రమే అందుతున్నాయి.
అదే సేంద్రియ ఎరువులు వాడితే మొక్కలకు అందాల్సిన 16 రకాల పోషకాలు అందుతాయని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంతేకాకుండా సేంద్రియ వ్యవసాయ సాగుతో పండించిన ధాన్యానికి ధర ఎక్కువ పలుకుతుందని చెబుతున్నారు.
పెట్టుబడుల భారం..
పశు సంపద తగ్గిపోవడం.. రైతులు రసాయనిక ఎరువులకు అలవాటుపడడంతో భూసారం తగ్గిపోతున్నది. దీంతో దిగుబడులు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా బస్తాల కొద్దీ యూరియా, డీఏపీ వేయడంతో నేల భౌతిక స్వభావం మారుతున్న ది. రసాయనిక ఎరువుల వాడకం పెరుగుతుండడంతో రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతున్నది. ముఖ్యం గా మొక్కజొన్న, పత్తి పంటలు భూసారాన్ని లాగేస్తాయి. దీనికితోడు యూరియా, డీఏపీలు మరింతగా నేల సా రాన్ని పీల్చివేస్తాయి. నేలలో లవణాలు తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికితోడు ఏటేటా వానలు కూడా తగ్గుముఖం పట్టడంతో నేలలు తడవడం లేదు. తొలకరి వానలు పడినప్పుడు మే, జూన్ నెలల్లో దుక్కు లు కలియదున్నిన చౌడు నేలల్లో పిల్లి పెసర, జీలుగ పంటలు వేయడం.. అవి మొలకెత్తిన తర్వాత కలియ దున్నితే మూలకాలు మారుతాయి.
సేంద్రియ ఎరువుల్లో పోషకాలు అనేకం..
వర్మీకంపోస్టు అంటే వానపాముల ఎరువు, పచ్చిరొట్ట, పశువుల ఎరువు వాడకంతో పంటలకు 16 రకాల పోషకాలు అందుతాయి. వీటిలో సూక్ష్మపోషకాలైన ఐర న్, కాపర్, మెగ్నీషియం, సల్ఫర్, జింక్ తదితరాలన్నీ ఉంటాయి. వీటికితోడు జీవ నియంత్రణ ఎరువులు కూ డా వేస్తే తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చు.
ఒకసారి సేంద్రి య ఎరువులు వేసినంత మాత్రాన దిగుబడులు రావు. రసాయనిక ఎరువులకు అలవాటు పడిన పొలాల్లో కొన్ని ఏండ్లపాటు సేంద్రియ ఎరువులు వాడితేనే ఫలితం వస్తుంది. రైతులు రసాయనిక ఎరువులను వాడితే దిగుబడులు ఏ మాత్రం రాకపోగా పెట్టుబడులు వాటికే సరిపోతాయి.
వర్మీ కంపోస్టుతో ప్రయోజనాలు..
వర్మీ కంపోస్టుతో నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. ఇది ఆ పంటకే కాకుండా రెండు, మూడు పంటలపై ప్రభావం చూపుతుంది. మొ క్కకు కావాల్సిన నత్రజని, భాస్వరం, పొటాష్తోపాటు పైరు ఎదుగుదలకు అవసరమయ్యే సేంద్రియ రసాయనాలు అధికంగా ఉంటాయి.
భూమికి ఉపయోగమైన సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేలకు ఇస్తాయి. కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల నాణ్య త పెరుగుతుంది. రంగు, రుచి, వాసన, రవాణలో నిల్వ ఉండే గుణం కలిగి ఉంటాయి.
సేంద్రియ ఎరువు తయారీ సులువే..
సేంద్రియ ఎరువులను సులువుగా తయారు చేసుకోవచ్చు. పశువుల వ్యర్థాలను ఇష్టానుసారంగా పారేయకుండా చెత్తను విడదీసి పశువుల పేడను.. ఒక పద్ధతి ప్రకారం నిల్వ ఉంచితే కొద్ది రోజుల్లో లభించేదే సేంద్రియ ఎరువు. జిల్లాలోని కొందరు రైతులు సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. రసాయనిక ఎరువుల వినియోగంతో వచ్చే దిగుబడుల కంటే సేంద్రియ ఎరువుల వినియోగం వల్లే నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి.
– గోవిందు నాయక్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, జోగుళాంబ గద్వాల