నవాబ్పేట, మే 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ అనంతయ్య కోరారు. మం డల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ పనితీరు ను ఏవో కృష్ణకిశోర్ వివరిస్తుండగా పలువురు ప్రజాప్రతినిధులు స్పందించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు డబ్బులను కొందరు బ్యాంకర్లు పంట రుణాలకు జమ చేసుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని సర్పంచ్ గోపాల్గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ ప్రశ్నించారు. వైద్యారోగ్యశాఖ పనితీరును వైద్యాధికారి విజయలక్ష్మి వివరిస్తుండగా పలువురు సభ్యులు ఆక్షేపించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుం టే.. సంబంధిత సిబ్బంది మాత్రం సక్రమంగా పనిచేయడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణులు దవాఖానకు వస్తే మామూలు కాన్పులకు కూడా జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారని వాపోయారు. ఐసీడీఎస్ పనితీరును సీడీపీవో శాంతిరేఖ వివరిస్తుండగా, ఎంపీపీ అనంతయ్య స్పందిస్తూ కాకర్జాలతండాలో నెలరోజుల నుంచి అంగన్వాడీ కేంద్రం ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. పలు శాఖల సిబ్బంది తమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు తెలియకుండా చేపడుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరును సంబంధిత అధికారి వివరిస్తుండగా, కల్మన్కల్వ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి స్పందిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న మరికల్, కొత్తపల్లి బస్సును అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వెంటనే బస్సును పునరుద్ధరించాలని సభలో తీర్మానం చేస్తున్నట్లు ఎం పీపీ అనంతయ్య ప్రకటించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అధికారు లు ప్రజాప్రతినిధులకు తెలియకుండా కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, తాసిత్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎంపీవో భద్రూనాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.