జడ్చర్ల, మే 12: రాష్ట్రంలోని దళితులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్చర్ల మండలంలో దళితబంధు పథకం కింద లబ్ధిపొందిన ఉదండాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురికి కార్లు, వల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురుకి జేసీబీలను గురువారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు పథకం దళితులకు వరంలాంటిదన్నారు. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, కోట్ల ప్రశాంత్రెడ్డి, నందకిశోర్, దేవా, అశోక్గౌడ్, ఇమ్మూ, నాగిరెడ్డి, బృందంగోపాల్, శ్రీకాంత్, రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, శంకరయ్యగౌడ్, రామాంజనేయులు, పరమటయ్య పాల్గొన్నారు.
జీలుగ విత్తనాలు పంపిణీ
జడ్చర్లలోని ఆగ్రోస్ కేంద్రంలో గురువారం జీలుగవిత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వ్యవసాయశాఖ ద్వారా 65శాతం సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేడీఏ వెంకటేశ్, ఏడీఏ ఆంజనేయులు, ఏవో గోపీనాథ్, ఏఈవోలు నవనీత, భవాని, శారద, మీనాక్షి ఉన్నారు.